Share News

YS Sharmila: జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు...మోదీ వారసుడు.. షర్మిల సెటైర్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:44 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

YS Sharmila: జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు...మోదీ వారసుడు.. షర్మిల సెటైర్లు

గుంటూరు జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల మీద ఏ ఒక్కరోజు కూడా కేంద్రంతో జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు...మోదీ వారసుడు అని విమర్శించారు. గురువారం నాడు గుంటూరు జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గుంటూరులో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత చెల్లెలు అని కూడా చూడకుండా వైసీపీ నేతలకు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. వేలాదిమంది ఉండే సభలో సొంత చెల్లెలు అని చూడకుండా తనపై అంబాఢాలు మోపారని ధ్వజమెత్తారు. తాను వేసుకున్న బట్టల గురించి ప్రస్తావిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దిగజారుడు రాజకీయాలు.. ఏం అవసరం ఉంది ? అని ప్రశ్నించారు. తాను బాబు దగ్గర మోకరిల్లానని వైసీపీ నేతలు అంటున్నారని షర్మిల ఫైర్ అయ్యారు.


AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్

జగన్ ఈ విషయాన్ని ఎలా మరిచారు...

‘‘నేను పసుపు చీర కట్టుకున్నానట. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా ..? చంద్రబాబు పచ్చ కలర్ కొన్నారా...? గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది కాదా.. ...? జగన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు. పసుపు మంగళకరం అయిన రంగని స్వయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. పసుపు రంగు టీడీపీ సొంతం కాదన్నారు. వైఎస్సార్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు చీర గురించి అలా మాట్లాడుతారా ? నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా ? చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగన్ రెడ్డినే. మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డి. నేను వైఎస్సార్ బిడ్డను..నాకు మోకరిల్లే అవసరం లేదు’’ అని షర్మిల అన్నారు.

YS-Sharmali.jpg


AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం

నాపై తప్పుడు ప్రచారం..

‘‘మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదు. క్రైస్తవులను చంపుతుంటే మోదీకి మద్దతు పలికారు. అయ్యా మీకు ఇవ్వాళ బంధువులు ఎవరు ? మీకోసం పరితపించిన వాళ్లు ఇవ్వాళ మీ వెనకా ముందు ఉన్నారో చూస్కోండి. జగన్ రెడ్డితో చెల్లెల్లు ఎవరు లేరు. వైఎస్సార్‌ను తిట్టిన రోజా, రజినీ ఇప్పుడు జగన్‌కి చెల్లెల్లు. అసెంబ్లీ వేదికగా వైఎస్సార్‌ను తిట్టిన వారు ఈయనకు బంధువులు. సీబీఐ వైఎస్సార్ పేరును చార్జీ షీట్‌లో చేర్చలేదు. ఇవ్వాళ అసలు విషయాలు చెబుతున్నా. సీబీఐలో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్. కేసు నుంచి జగన్‌ను బయట పడేసేందుకు వైఎస్సార్ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్పించాడు. సుధాకర్ రెడ్డి అనే లాయర్‌తో హైకోర్టులో చేర్పించాడు. పిటీషన్ వేసి మరి చేర్పించాడు. ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోండి. సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందన లేదు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.


Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎంపీ అవినాష్ రెడ్డి మంచోడా..?

‘‘మీ గుండెలో ఉన్నది గుండెనా..? బండనా ?. సొంత చిన్నాన్నను చంపిన వారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. హంతకులను రక్షిస్తూ వాళ్లకే ఎంపీ టిక్కెట్లు ఎలా ఇచ్చారు. జగన్ గారు ఇవ్వాళ పులివెందులకు వెళ్లారు. వివేకానంద రెడ్డి ప్రస్తావన తీశారు. ఒక్క మంచిమాట కూడా జగన్ నోట నుంచి రాలేదు.వివేకాకు రెండో పెళ్లి అయ్యిందట..ఇంకో సంతానం ఉందట. వివేకా ప్రజా నాయకుడు అని గానీ ...వైఎస్సార్‌కి తమ్ముడని ఎందుకు చెప్పలేదు ?. వైఎస్సార్సీపీ(YSRCP) కోసం ఎంత పని చేశారు.? ఇదేమి గుర్తుకు రాలేదా.? వీళ్లు వివేకా గురించి మాట్లాడొచ్చు అంట..మేము మాట్లాడొద్దు అంట. మేము మాట్లాడకూడదని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నవాడు అంట.. మంచోడు అంట .ఆయన భవిష్యత్ పాడు చేస్తున్నమట. అవినాష్ రెడ్డినీ ఎంపీగా నిలబెట్టినప్పుడు మేము ఎదురు చెప్పలేదు. వివేకా వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదే. వివేకా హత్య రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా. మాకు అవినాష్ రెడ్డి భవిష్యత్ పాడు చేసే అవసరం లేదు. ఎందుకు అవినాష్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా ? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా.. ? ఆలోచన శక్తి లేదా.. ? సీబీఐ అన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనపడటం లేదా..? మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు సమాధానం చెప్పాలి. మామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు...సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్ నిలబడి చూశాడు అని చెప్పారని అన్నారు.. అధికారంలో లేనప్పుడు CBI దర్యాప్తు కావాలని అడిగారు. అధికారంలో వచ్చాకా సీబీఐ దర్యాప్తు వద్దు అన్నారు. సాక్షి చానెల్లో వివేకా హత్యను గుండెపోటుగా చూపించారు’’ అని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 10:12 PM