Share News

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

ABN , Publish Date - May 26 , 2024 | 08:13 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నోముల మాణిక్యాల రావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు.

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

గుంటూరు: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నోముల మాణిక్యాలరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. పోలింగ్ రోజు పిన్నెల్లి స్వగ్రామం కల్లకుంటలో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారు. అయితే ఆయనపై, ఆయన కుటుంబంపై పిన్నెల్లి, అతని సోదరుడు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ విషయంపై మాణిక్యాలరావు ఆదివారం(ఈరోజు) ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు తీసుకోకుండా నిరాకరించారు.

న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణతో కలిసి ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జీరో FIR నమోదు చేయాలని న్యాయవాది లక్ష్మీనారాయణ కోరారు. పలనాడు ఎస్పీకు ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. మాణిక్యాల రావును పోలీసులు బయటకు లాగేశారు.


కాగా.. కండ్లకుంట గ్రామంలో పోలింగ్ రోజు టీడీపీ ఏజెంట్ నోముల మాణిక్యాలరావును పిన్నెల్లి వెంకటరామిరెడ్డి బెదిరించిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల కల్లా తనని చంపేస్తానని పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెదిరించాడు. జరిగిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో లాయర్ గుడపాటి లక్ష్మీనారాయణతో ఫిర్యాదు చేయడానికి నోముల మాణిక్యరావు వెళ్లారు. ఫిర్యాదును స్వీకరించేందుకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కిరణ్ నిరాకరించారు. జీరో ఎఫైర్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేయాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించుకోవడంతో డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు నోముల మాణిక్యాలరావు వెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

AP News: ఆయన ఆరోపణలు వాస్తవం కాదు.. లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:35 PM