Share News

Nara Lokesh: ఎన్నికల కోడ్ సాకుతో ఇలా చేయొద్దు.. నారా లోకేష్ ఫైర్

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:40 PM

మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను అనుమతించాలంటూ గుంటూరు కలెక్టర్‌కు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లేఖ రాశారు.

Nara Lokesh: ఎన్నికల కోడ్ సాకుతో ఇలా చేయొద్దు.. నారా లోకేష్ ఫైర్

అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను అనుమతించాలంటూ గుంటూరు కలెక్టర్‌కు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) గురువారం లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లేఖ రాశారు. మానవతా దృక్పథంతో తాగునీరు సరఫరాకు అంగీకరించాలని వినతిపత్రంలో కోరారు. మంగళగిరి పరిధిలోని నవులూరు, యర్రబాలెం, చిన కాకాని, ఆత్మకూర్, కాజా, మంగళగిరి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని తెలిపారు.


AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్

నియోజకవర్గoలో 2022 ఏప్రిల్ 20 నుంచి టీడీపీ వాటర్ ట్యాంక్‌ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోందని వివరించారు. ఎన్నికల కోడ్ కారణంగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వo తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో తెలుగుదేశం-మంగళగిరిలో నీటి ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాని కొనసాగించేందుకు అనుమతించాలని నారా లోకేష్ కోరారు.


ఇవి కూడా చదవండి

TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి

AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం

Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 06:12 PM