AP Elections: ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు
ABN , Publish Date - May 23 , 2024 | 07:38 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది.
![AP Elections: ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు](https://media.andhrajyothy.com/media/2024/20240511/ambati_f5652edec5.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు (ambati rambabu)చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగాయని, రీ పోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించి, కొట్టి వేసింది. మరోవైపు చంద్రగిరిలో స్క్రూటినీ రీ షెడ్యూల్ చేయాలని, రీ పోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను కూడా హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.
For More Andhra Pradesh News and Telugu News..