Share News

Arimilli Radhakrishna: చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కారుమూరికి లేదు

ABN , Publish Date - Jan 09 , 2024 | 02:27 PM

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ( Minister Karumuri Nageswara Rao ) చేసేది ప్రజా దీవెన యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని టీడీపీ ( TDP ) మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ( Arimilli Radhakrishna ) విమర్శించారు.

Arimilli Radhakrishna: చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కారుమూరికి లేదు

పగో: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ( Minister Karumuri Nageswara Rao ) చేసేది ప్రజా దీవెన యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని టీడీపీ ( TDP ) మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ( Arimilli Radhakrishna ) విమర్శించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కారుమూరి అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలను హింసించి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేవలం కబుర్లతో మళ్లీ ప్రజలను మంత్రి కారుమూరి మోసం చేస్తున్నారని అన్నారు. ఏం మొఖం పెట్టుకుని ప్రజాదీవెన యాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. కారుమూరి కులాలను తిట్టారని.. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఆచంటలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సభ గురించి ఆయన మాట్లాడుతున్నారని.. అసలు తనకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2024 | 03:03 PM