Share News

Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , Publish Date - Jan 26 , 2024 | 09:47 AM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.

 Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి: దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు (Padma Vibhushan Award) మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని వరించింది. దీంతో ఇద్దరు నేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారు. వీరిద్దరూ కఠోర శ్రమ, దృఢ సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణ వల్ల ఆయా రంగాల్లో విజయం సాధించారు. చిరంజీవి, వెంకయ్య నాయుడు పలువురికి స్ఫూర్తిగా నిలిచారు అని’ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 09:47 AM