Share News

YSRCP: అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్..

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:59 PM

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. భారీ అనుచర గణంతో దివంగత మత్స్యకార నేత సైకం అర్జునరావు వర్గీయులు.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో ఎదురుమొండి, సంగమేశ్వరం, కమ్మనమోలు గ్రామాల ప్రజలు.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

YSRCP: అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్..

విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. భారీ అనుచర గణంతో దివంగత మత్స్యకార నేత సైకం అర్జునరావు వర్గీయులు.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో ఎదురుమొండి, సంగమేశ్వరం, కమ్మనమోలు గ్రామాల ప్రజలు.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దశాబ్ద కాలంగా వెన్నుదన్నుగా ఉన్న సైకం అర్జునరావు వర్గం పార్టీని వీడటంతో ఆ ప్రాంతంలోని మత్స్యకారుల్లో వైసీపీ పూర్తిగా వైసీపీ పట్టు కోల్పోయింది.

AP Elections: జగన్‌‌ ముందు ‘జై పవన్’ అన్నారని ఆ విద్యార్థులను ఏం చేశారంటే?


మరోవైపు సైకం అర్జునరావు మనుమడు దినేష్ నేతృత్వంలో భారీగా చేరికలతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వైసీపీలో అవినీతి అరాచకాలు చూడలేకే తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరుతున్నట్లు దినేష్ ప్రకటించారు. అభివృద్ధి కాముకుడైన టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు న్యాయం జరిగిందని సైకం వర్గీయులుతెలిపారు. మరోవైపు చంద్రబాబు పుట్టిన రోజున పార్టీలో చేరికలు నేతలను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Kanakamedala Ravindra Kumar: అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్...

ఒక్క చాన్సే చివరి చాన్స్‌ కావాలి! జగన్‌ నైజం దోపిడీ, విధ్వంసమే: చంద్రబాబు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 01:59 PM