Share News

Atchannaidu: ఓటమి ఖాయమనే టిక్కెట్ల దుకాణానికి జగన్ గ్యాంగ్ తెర

ABN , Publish Date - Mar 13 , 2024 | 01:25 PM

Andhrapradesh: ఎన్నికల్లో ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి జగన్ రెడ్డి గ్యాంగ్ తెరలేపిందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటూ అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఒక వైపు ఓటర్లకు గిఫ్టులు పంచుతూ మరోవైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారన్నారు.

Atchannaidu: ఓటమి ఖాయమనే టిక్కెట్ల దుకాణానికి జగన్ గ్యాంగ్ తెర

అమరావతి, మార్చి 13: ఎన్నికల్లో (AP Elections) ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి జగన్ రెడ్డి గ్యాంగ్ తెరలేపిందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటూ అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఒక వైపు ఓటర్లకు గిఫ్టులు పంచుతూ మరోవైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారన్నారు. మల్లెల రాజేష్ నాయుడు నుంచి మంత్రి రజిని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. సజ్జల లాంటి బ్రోకర్లను పెట్టుకొని జగన్ రెడ్డి (CM Jagan) కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్ధుల నుంచి దాదాపు రూ.1,000 కోట్లు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల పంపించారన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy), మంత్రి విడదల రజనీపై (Minister Vidadal Rajini) వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

NTR - Bharata Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న?.. నేడు కీలక నిర్ణయం!

Congress: కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలి.. జీవన్‌రెడ్డి ఎద్దేవా

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 13 , 2024 | 01:25 PM