Share News

AP Politics: డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రా.. వైఎస్ షర్మిల విసుర్లు

ABN , Publish Date - Mar 23 , 2024 | 05:37 PM

ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు యువతకు మత్తు సరఫరా చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శించారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా దొరికే ఉడ్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నాయని వివరించారు.

AP Politics: డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రా.. వైఎస్ షర్మిల విసుర్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు యువతకు మత్తు సరఫరా చేసే డ్రగ్స్ (Drugs) క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా దొరికే ఉడ్తా ఆంధ్రప్రదేశ్‌గా (Andhra Pradesh) మారిందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైపు ఉన్నాయని వివరించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని షర్మిల (YS Sharmila) విరుచుకుపడ్డారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో నంబర్ వన్ అనే ముద్ర పడిందన్నారు.

‘25 వేల కేజీల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరాయి. తమ తప్పు లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థ సాయం లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి? డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండ దండలతో డ్రగ్స్ రవాణాలో ఏపీ సేఫ్ హెవెన్‌గా మారింది. తెర వెనుక ఎవరున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐని కోరాం. ఆసియాలో అతి పెద్ద డ్రగ్ డీల్ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చాలి. పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి అని’ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

AP Politics: ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 23 , 2024 | 05:37 PM