Share News

Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:12 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్ అని.. ఇటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని.. పుట్టపర్తి శంఖారావం సభలో టీడీపీ ఇన్‌చార్జి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు పెట్టారన్నారు. ఒక్క రాజధాని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే నమ్మడానికి జనం చెవిలో పూలు ఉన్నాయా? అని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు.

Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?

పుట్టపర్తి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఒక పెద్ద శాడిస్ట్ అని.. ఇటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని.. పుట్టపర్తి శంఖారావం సభలో టీడీపీ (TDP) ఇన్‌చార్జి పల్లె రఘునాథరెడ్డి (Palle Raghunath Reddy) పేర్కొన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు పెట్టారన్నారు. ఒక్క రాజధాని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే నమ్మడానికి జనం చెవిలో పూలు ఉన్నాయా? అని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు.

AP Elections: మళ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ.. అందరూ బిగ్‌షాట్‌లే..!

మీ బిడ్డనంటూనే 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేసినవాడు ప్రజలకేం న్యాయం చేస్తాడని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ నిజం చెబితే ఆయన తల వెయ్యి ఒక్కలవుతుందని శాపం ఉందని... అందుకే ఒక్క మాట కూడా నిజం చెప్పడన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (MLA Sridhar Reddy) అవినీతి అనకొండగా మారారన్నారు. బ్యాంకులకు 1670 కోట్లు టోకరా వేసిన వ్యక్తి ఏ విధంగా ప్రజలకు సేవలందిస్తారని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే పుట్టపర్తిని మాఫియారాజ్ గా మార్చిన స్థానిక ఎమ్మెల్యేకి బుద్దిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన ప్రభుత్వం వచ్చాక పుట్టపర్తిని టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేయాలన్నారు. పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.

TDP: సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న లోకేష్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 12:12 PM