MOHAMMED AHMED SHARIF : మోసకారి జగనను ముస్లింలు నమ్మరు
ABN , Publish Date - May 03 , 2024 | 12:58 AM
తనది మైనార్టీల ప్రభుత్వమని మోసం చేసిన జగనను ముస్లిం సమాజం ఇక ఎన్నటికీ నమ్మదని శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జగన హయాంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమిలో ...
టీడీపీ, బీజేపీ పొత్తుతోనే ముస్లింల సంక్షేమం
శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్ అహ్మద్ షరీఫ్
గుంతకల్లు, మే 2: తనది మైనార్టీల ప్రభుత్వమని మోసం చేసిన జగనను ముస్లిం సమాజం ఇక ఎన్నటికీ నమ్మదని శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జగన హయాంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమిలో
టీడీపీ ఉన్నా రిజర్వేషన్లను తొలగించలేదని గుర్తుచేశారు. ముస్లింలు టీడీపీ పక్షాన ఉన్నారని, ఈ ఎన్నికల్లో టీడీపీకి 125 స్థానాలు లభించడం ఖాయమని అన్నారు. మైనార్టీలను మోసం చేసిన జగన మోహన రెడ్డి.. ఇకపై జగన ‘మోసం’ రెడ్డి అని టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ విమర్శించారు. ఎన్నికలకు ముందు జనానికి ముద్దులు పెట్టిన జగన, అధికారంలోకి రాగానే పేదల నోటికాడి ముద్దని లాగేసుకున్నారని అన్నారు. అన్న క్యాంటినలను రద్దుచేసి పేదల పొట్టకొట్టారని అన్నారు. జగన పరిపాలనలో అబ్దుల్ సలాం కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని, మిస్బా అనే విద్యార్థిని వైసీపీ నాయకుడి నిర్వాకం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. ఈ సంఘటనలపై జగన నోరెత్తిన పాపాన పోలేదని అన్నారు. వైసీపీకి బుద్ధి చెప్పడానికి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గుమ్మనూరు జయరాం, ఆంబికా
లక్ష్మినారాయణకు ముస్లింలు ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేంద్రగౌడు, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, నాయకులు కేసీ హరి, పవనకుమార్ గౌడు, పత్తి హిమబిందు, డనల్ప బాషా, సలీం, డాక్టర్ ఉమర్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....