NOMINATONS : ఈరోజే లాస్ట్..!
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:56 PM
నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ స్థాయిలో నామినేషన్లు పడ్డాయి. ఎంపీ స్థానానికి నాలుగు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున మల్లికార్జున, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున నల్లాని రమేష్నాయుడు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన వేశారు. నామినేషన్లు వేసేందుకు గురువారం ఆఖరి రోజు. చివరి రోజున కూడా భారీగా....
నామినేషన్లకు ముగియనున్న గడువు
అనంతపురం టౌన, ఏప్రిల్ 24: నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ స్థాయిలో నామినేషన్లు పడ్డాయి. ఎంపీ స్థానానికి నాలుగు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున మల్లికార్జున, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున నల్లాని రమేష్నాయుడు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన వేశారు. నామినేషన్లు వేసేందుకు గురువారం ఆఖరి రోజు. చివరి రోజున కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.
- ఉరవకొండలో టీడీపీ తరఫున కేశవ్, పయ్యావుల శ్రీనివాసులు, వైసీపీ తరఫున విశ్వేశ్వరరెడ్డి, ప్రణయ్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదనరెడ్డి, భారత చైతన్య యువజన పార్టీ తరఫున బెస్తపవన, జైభారత నేషనల్ పార్టీ తరపున రామాంజినేయులు, స్వతంత్రులు బాలరామాంజినేయులు, చంద్రశేఖరరెడ్డి నామినేషన వేశారు.
-రాయదుర్గంలో టీడీపీ తరఫున కాలవ శ్రీనివాసులు, కాలవ విజయలక్ష్మి, వైసీపీ తరఫున మెట్టుగోవిందరెడ్డి, మెట్టు విశ్వనాథరెడ్డి, స్వతంత్రులు రంగనాథ్, కురుబ శ్రీనివాసులు, పగడాల గోవిందరాజులు, గోవిందు, బెళ్లారి గోవింద నామినేషన వేశారు.
- రాప్తాడులో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, స్వతంత్రులు వెంకటరాముడు, సంతోష్ కుమార్రావు, వై.నల్లప్ప, ఆబిదాల గోవిందు, కె. కేశవరెడ్డి నామినేషన వేశారు.
- కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, కాంగ్రెస్ అభ్యర్థి రాంభూపాల్రెడ్డి, జైభీంరావ్ భారత పార్టీ తరఫున వెంకటేశులు, స్వతంత్రులు బలిజ శ్రీనివాసులు, తగ్గుపర్తి రామన్న నామినేషన వేశారు.
- అనంతపురం అర్బనలో టీడీపీ తరఫున దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇద్దరు స్వతంత్రులు నామినేషన వేశారు.
- శింగనమలలో వైసీపీ తరఫున వీరాంజనేయులు, కాంగ్రెస్ తరఫున డాక్టర్ శైలజానాథ్, స్వతంత్రులు రవిరాజు, ఓబిళేసు నామినేషన వేశారు.
- గుంతకల్లులో వైసీపీ తరఫున వై.వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి శారద, ఎస్పీ తరఫున జంగం క్రిష్ణ, స్వతంత్రులు రామాంజినేయులు, రహిమ, పి.శశిభూషణరెడ్డి, ప్రభాకర్, తోక భారతి, అరుణమ్మ నామినేషన వేశారు.
- తాడిపత్రిలో వైసీపీ తరఫున పెద్దారెడ్డి, టీడీపీ తరఫున అశ్మిత రెడ్డి, స్వతంత్రులు ఒకరు, జైబీంరావు పార్టీ తరపున ఒకరు నామినేషన వేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....