Minister Dayakar Rao: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దు

ABN , First Publish Date - 2023-10-11T20:03:43+05:30 IST

ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.

Minister Dayakar Rao: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దు

జనగామ: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు. బుధవారం నాడు జనగామ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ... ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గీయులు అంతా కలిసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయాలి. ముత్తిరెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చి కేసీఆర్ గౌరవం ఇచ్చారు. ఇకపై విభేదాలు సృష్టించి గొడవలు చేస్తే కేసీఆర్‌కు ద్రోహం చేసినట్టే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సరిగా లేవు. కాంగ్రెస్ నేతలు దొంగ సర్వేలు చేసి గెలుస్తామంటున్నారు. మీ దగ్గరకు వచ్చే నేతలను నిలదీయాలి’’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-11T20:03:43+05:30 IST