Share News

Rahul Gandhi: కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2023-11-02T13:28:26+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాహుల్ సందర్శించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ డ్యామేజీని పరిశీలించారు. దాదాపు గంటన్నరపాటు రాహుల్ పర్యటన కొనసాగింది. అయితే కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Rahul Gandhi: కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ ఆసక్తికర ట్వీట్

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో (Telangana State) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను (Kaleshwaram Project) రాహుల్ సందర్శించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ డ్యామేజీని పరిశీలించారు. దాదాపు గంటన్నరపాటు రాహుల్ పర్యటన కొనసాగింది. అయితే కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ఏటీఎం. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాను. నాసిరకం నిర్మాణం కారణంగా పలు స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్తంభాలు మునిగిపోతున్నట్లు నివేదికలు వచ్చాయి. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్, ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారు’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-11-02T13:28:28+05:30 IST