Home » Jayashankar Bhupalapally
Telangana: పోలీస్స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్స్టేషన్లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
Telangana: కాళేళ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Telangana: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పుట్ట నరసింహస్వామి అనే వ్యక్తి... నల్ల అవినాష్(25)పై కత్తితో దాడి చేశాడు. తన భార్యతో నల్ల అవినాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నడనే అనుమానంతో నర్సింహులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను రాహుల్ సందర్శించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ డ్యామేజీని పరిశీలించారు. దాదాపు గంటన్నరపాటు రాహుల్ పర్యటన కొనసాగింది. అయితే కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
అవును.. తెలంగాణలో ఎన్నికలకు (TS Assembly Polls) ముందు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్(BRS) కు అడుగడుగునా ఊహించని షాక్లే తగులుతున్నాయి...
కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు.
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.