Bandi Sanjay: అందుకే కర్ణాటకకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది: బండి సంజయ్

ABN , First Publish Date - 2023-02-01T18:17:08+05:30 IST

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామ‌న్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.

Bandi Sanjay: అందుకే కర్ణాటకకు కేంద్రం ప్యాకేజీ  ప్రకటించింది: బండి సంజయ్

హైదరాబాద్: ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామ‌న్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. కేంద్ర బడ్జెట్‌కు మంచి ప్రజాస్పందన వస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ ప్రయోజనాలు అందేలా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే బీజేపీ ధ్యేయమని పేర్కొన్నారు. కర్ణాటక కరువు ప్రాంతం కాబట్టి ప్రతిపాదనలు పంపారని, అందుకే కర్ణాటకకు కేంద్రం ఓ ప్యాకేజీని ప్రకటించిందని బండి సంజయ్ తెలిపారు. ‘‘తెలంగాణ నుంచి ఏం ప్రతిపాదనలు ఇచ్చారు?, ప్రధాని ఆవాస్ యోజనకు కేంద్రం నిధులిస్తే కేసీఆర్ (KCR) ఏం చేశారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇది ఎన్నికల బడ్జెట్ అంటూ కొందరు మాట్లాడటం సరికాదన్నారు.

Updated Date - 2023-02-01T18:23:41+05:30 IST