Share News

Jagadish Reddy: రాహుల్ గాంధీ, ప్రియాంక రాసిచ్చిన స్క్రిఫ్ట్ చదువుతున్నారు

ABN , First Publish Date - 2023-10-22T18:51:05+05:30 IST

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి స్క్రిఫ్ట్ రాసి ఇచ్చి చదవిపిస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadish Reddy) సెటైర్లు వేశారు.

Jagadish Reddy: రాహుల్ గాంధీ, ప్రియాంక రాసిచ్చిన  స్క్రిఫ్ట్ చదువుతున్నారు

నల్గొండ: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి స్క్రిఫ్ట్ రాసి ఇచ్చి చదవిపిస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadish Reddy ) సెటైర్లు వేశారు. ఆదివారం నాడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ పార్టీని నమ్మితే కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. సబ్ స్టేషన్‌లో మొసళ్లను తీసుకోని వచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. పగటి పూట 5 గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలను మోసం చేసింది. బెంగుళూర్ సహా ప్రధాన నగరాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ అవినీతికీ పాల్పడిందని తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ప్రజలు గెలిపించారు.కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రైతులకు గుండు కొట్టి సున్నం కొడుతుంది. మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడే కరెంట్ కోతలు ఉన్నాయి. పెద్ద మనిషి జానారెడ్డి వయస్సు పెరుగుతున్ననిజాలు మాట్లాడడం లేదు. జానారెడ్డి గతంలో జనరేటర్ పెట్టుకొని పడుకునేవాడు’’ అని మంత్రి జగదీష్‌రెడ్డి ఎద్దేవ చేశాడు.

Updated Date - 2023-10-22T19:17:34+05:30 IST