KTR: బీజేపీ మత పిచ్చి పార్టీ.. కాంగ్రెస్ గ్యారంటీ లేని పార్టీ

ABN , First Publish Date - 2023-10-03T14:15:26+05:30 IST

మోదీ నువ్వు గాంధీని పూజిస్తావా..? గాడ్సే ను పూజిస్తావా?, నిజామాబాద్‌లో చెప్పి వెళ్ళు. గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తారా..? కాంగ్రెస్ హయాంలో కరెంటే లేదు.

KTR: బీజేపీ మత పిచ్చి పార్టీ.. కాంగ్రెస్ గ్యారంటీ లేని పార్టీ

జగిత్యాల: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. జగిత్యాలలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ నువ్వు గాంధీని పూజిస్తావా..? గాడ్సే ను పూజిస్తావా?, నిజామాబాద్‌లో చెప్పి వెళ్ళు. గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తారా..? కాంగ్రెస్ హయాంలో కరెంటే లేదు. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారు. కాంగ్రెస్ హయాంలో నీళ్ల కోసం రైతులు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను నమ్మొద్దు. రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ ఏజెంట్. ఆరెస్సెస్ నాయకుడ్ని పీసీసీ చీఫ్ చేస్తారా..?, బీజేపీ దొంగ పార్టీ.. దానికి మత పిచ్చి తప్ప ఇంకోటి తెల్వదు.’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-10-03T14:15:26+05:30 IST