Share News

Gangula kamalakar: ఆంధ్రా నేతలకు తెలంగాణలో ఏం పని?

ABN , First Publish Date - 2023-10-13T12:06:03+05:30 IST

కాంగ్రెస్, బీజేపీ బీ ఫామ్‌లు ఢిల్లీలో ఒకే చోట తయారవుతాయని.. ఆ రెండు పార్టీలు కలిసే ఉంటాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Gangula kamalakar: ఆంధ్రా నేతలకు తెలంగాణలో ఏం పని?

కరీంనగర్: కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) బీ ఫామ్‌లు ఢిల్లీలో ఒకే చోట తయారవుతాయని.. ఆ రెండు పార్టీలు కలిసే ఉంటాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి తెలంగాణలో ఈ సారి గుండు సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. భయంతోనే రెండు చోట్లా ఈటల పోటీ చేస్తా అంటున్నారన్నారు. మతతత్వ, భూ కబ్జాలు చేసే పార్టీలకు అధికారం ఇవ్వొద్దని కోరారు. ఆంధ్రా నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, ప్రజాశాంతిపార్టీ అధ్యక్షులు కేఏ పాల్, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డిలను నమ్మొద్దన్నారు. బండి సంజయ్ ఆరోపణలు పట్టించుకోమని గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-13T12:06:03+05:30 IST