Share News

Bandi Sanjay: హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారు

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:48 PM

కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) పేర్కొన్నారు. మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

Bandi Sanjay: హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారు

కరీంనగర్: కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) పేర్కొన్నారు. మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తబ్లీగీ జమాత్‌ను ఇస్లామిక్ దేశాలు నిషేధించాయని... ఆ సంస్థని రాష్ట్రానికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. కొవిడ్‌ను తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిందే తబ్లీగీ జమాత్‌ సంస్థనేనని చెప్పారు. తిరుపతిలో పులులు వస్తే భక్తులకు కర్రలు ఇస్తారా అని ఎద్దేవా చేశారు. తిరుమలకు భక్తులు రాకుండా కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 05:10 PM