Raja Singh Request : కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

ABN , First Publish Date - 2023-06-18T16:25:21+05:30 IST

రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్‌కు (DGP Anjani Kumar) లేఖ రాశారు.

Raja Singh Request : కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్‌కు (DGP Anjani Kumar) లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని (TS Govt) కూడా ఆయన హెచ్చరించారు.

Raja-Singh-On-Bakrid.jpg

మీకు చేతకాకపోతే..!

ఈ బక్రీద్ సందర్భంగా సంబరాలు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేకలు, గొర్రెలు కొసుకుని బక్రీద్ సంబరాలు చేసుకుంటే కూడా మాకు ఇబ్బంది లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆవులు, దూడలను కోయరాదు. ఆవులు, దూడలు కోస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదు. కనీసం ఎక్కడా చెక్ పోస్ట్‌లు కూడా ఏర్పాటు  చేయలేదు. మీకు చేతకాకపోతే చెప్పండి మా ఆవులు దూడలు రక్షించుకునేందుకు మేమే రంగంలోకి దిగుతాం. సీఎం కేసీఆర్‌కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాను.. వెంటనే చర్యలు తీసుకోండి. మతపరమైన గొడవలు కావద్దనే మేం ఇలా అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే మా టీమ్‌లు రంగంలోకి దిగుతాయి.. జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా గోషామహల్ ఎమ్మెల్యే విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ లేఖపై డీజీపీ, కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Raja-Singh.jpg

ఇదేం మంచిది కాదు..!

కాగా.. గత నాలుగైదు రోజులుగా గోవుల అక్రమ రవాణా చేయకూడదని, గోవధను ఖండించాలని రాజాసింగ్ వరుస ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. గోవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులే సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్​ప్రొటెక్షన్‌తో రాష్ట్రంలో వేల ఆవులు కోతకు గురవుతున్నాయని ఆవేదనకు లోనయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుల రక్తంతో తడిసిన రాష్ట్రానికి మంచి జరగదన్నారు. ఛత్రపతి శివాజీ స్పూర్తితో గోరక్షకులు నడుం బిగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ ఇటీవలే పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఆ మధ్య గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళంగా తీసుకోవద్దని కూడా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనమే అయ్యాయి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తేలిందంటే..!


******************************

BRS MLA Candidates : బహిరంగ సభలో బిగ్ షాకిచ్చిన కేటీఆర్.. నో చెప్పేసినట్టే.. అంతా అయోమయం..!


******************************

TS Congress : తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’.. ఈ పెను సవాళ్ల సంగతేంటి.. ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?

******************************

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

******************************

Updated Date - 2023-06-18T16:30:58+05:30 IST