Home » Goshamahal
హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డ దొంగలు పెద్ద మొత్తంలో బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు.
హైదరాబాద్ గోషామహల్ సెక్షన్ పరిధిలో వారం రోజులుగా కలుషిత నీటి సరఫ రా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27వ తేదీలోగా ఆయనను చంపేస్తామని ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఆలయాలను అపవిత్రం చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడి, మాజీమంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయన్నారు.
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని బీజేపీ గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ కార్యాలయం వద్ద పాకిస్థాన్ జెండా స్టిక్కర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. అయితే.. ఎమ్మెల్యే మాత్రం తిరుపతి వెళ్లారు. కార్యాలయం వద్ద చెప్పులు విడిచే స్థలంలో పాకిస్థాన్ జెండా స్టిక్కర్లను అతికించడం కలకలం సృష్టించింది.
పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్బోర్డు బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఎలాంటి షరతు లేకుండా మద్దతు ప్రకటించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది, ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకుని 14 మార్పులు కూడా చేశారన్నారు.