Share News

Vijayashanti : ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారు

ABN , First Publish Date - 2023-12-07T22:40:06+05:30 IST

బీఆర్ఎస్ ( BRS ) అధినేత కేసీఆర్‌ ( KCR ) ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గత నాలుగు రోజులుగా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు కలిసి బయటకొస్తున్నారు. ఆ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆర్నెళ్లకన్నా ఎక్కువ ఉండదని.. మళ్లా తిరిగి తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్పించడం సరిదిద్దుకోలేని తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanti :  ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారు

హైదరాబాద్: బీఆర్ఎస్ ( BRS ) అధినేత కేసీఆర్‌ ( KCR ) ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గత నాలుగు రోజులుగా ఆ పార్టీ సీనియర్ నేతలు కొంతమంది కలిసి బయటకొస్తున్నారు. ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆర్నెళ్లకన్నా ఎక్కువ ఉండదని.. మళ్లా తిరిగి తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్పించడం సరిదిద్దుకోలేని తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాములమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయశాంతి ఏమన్నారంటే... ‘‘అధికార స్వార్థం, అహంకారం, దోపిడి, దుర్మార్గ నియంతృత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిణామాలను సహజంగా వ్యతిరేకిస్తాయి. అలాగే ఒకనాటి టీఆర్‌ఎస్‌కు 2014 ఎన్నికల్లో వచ్చినవి 63 స్థానాలే. ఇప్పటి కాంగ్రెస్ కన్నా ఆ ఎన్నికల్లో తక్కువగా వచ్చాయి. ఆ టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్‌గా మారి పదేళ్ల ప్రభుత్వం నడిపించినప్పుడు.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నడవదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కుట్రలకు తెలంగాణ సమాజానికి తప్పకుండా సమాధానం చెప్పాలి. కేసీఆర్.. మీ పార్టీ నేతలు చేసిన పై ప్రకటన తప్పు అని చెప్పండి.‌ మీపై ఆ బాధ్యత ఉన్నది, మీరు ప్రజాస్వామ్య వాది అయినట్లయితే... మీరు, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారిపోతున్నారన్నా సమస్యను తప్పించుకోవడానికే ఇలా చెప్పిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది’’ అని విజయశాంతి ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-12-07T22:40:09+05:30 IST