Share News

Tasani Srinivasyadav: ఆ రెండు పార్టీలు ఆకాశం నుంచి చందమామను తెస్తామంటున్నాయ్.. తలసాని ఎద్దేవా

ABN , First Publish Date - 2023-11-20T13:02:26+05:30 IST

ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరుగనుంది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు.

Tasani Srinivasyadav: ఆ రెండు పార్టీలు ఆకాశం నుంచి చందమామను తెస్తామంటున్నాయ్.. తలసాని ఎద్దేవా

హైదరాబాద్: ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సభ జరుగనుంది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సోమవారం ఉదయం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ సికింద్రాబాద్‌ను ప్రేమించే వాళ్ళు కేసీఆర్ సభకు హాజరై సంఘీభావం తెలపాలన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ (BRS) పాలనలో నగరంలో అనేక అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. సంక్షేమ రంగాల్లో అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. ఎలక్షన్‌లు వన్ సైడ్‌గా జరుగుతాయని అన్నారు. హ్యట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఢిల్లీ నుంచి గద్దల్లా దిగుతుతున్నారని... ప్రతి పక్షాల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని అన్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు భారీ స్పందన వస్తోందన్నారు. ఆకాశం నుంచి చందమామను తెస్తామని బీజేపీ (BJP), కాంగ్రెస్‌లు (Congress) అంటున్నాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే వారి మాటలు నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-20T13:02:28+05:30 IST