Share News

Telangana Elections: రఘునందన్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

ABN , First Publish Date - 2023-11-22T14:59:03+05:30 IST

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రోడ్ షోలో పాల్గొన్నారు.

Telangana Elections: రఘునందన్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

సిద్దిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు (BJP Candidate Raghunandan Rao) మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (MRPS Chief Mandakrishna Madiga) రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఏ కులానికి వ్యతిరేకం కాదని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తన జాతి అభివృద్ధి కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో (Telangana) మూడు పార్టీల మధ్యన జరుగుతున్న పోరాటమన్నారు. ఎవరు సరైన వారో నిర్ణయించే అవకాశం కేవలం ఓటర్లకే ఉందన్నారు. మహిళలను 45% రిజర్వేషన్ ఇచ్చి చట్టసభల్లోకి పంపిన ఘనత నరేంద్ర మోడీ ది (PM Narendra Modi) అని చెప్పుకొచ్చారు. మహిళల కోసం రాజీనామా చేసింది అంబేద్కర్ అయితే మహిళలకు 45% రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ అని అన్నారు. సామాజిక న్యాయం అంటే కేసీఆర్‌కు, కాంగ్రెస్‌కు నచ్చదన్నారు. సామాజిక న్యాయం జరిగేది ప్రధాని నరేంద్ర మోడీతోనే అని చెప్పుకొచ్చారు. సేవ చేసే రఘునందన్ రావును గెలిపించి అభివృద్ధి పనులు చేసుకోండి అని మందకృష్ణ మాదిగ కోరారు.

Updated Date - 2023-11-22T14:59:04+05:30 IST