Share News

Kotha Prabhakar Reddy: రఘునందన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-29T16:53:43+05:30 IST

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అని మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) అన్నారు.

Kotha Prabhakar Reddy: రఘునందన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు

సిద్దిపేట (దుబ్బాక): మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) అని మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) అన్నారు. ఆదివారం నాడు తొగుట మండలం లింగాపూర్, వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని కులాలను, మతాలను గౌరవించుకుంటున్నాం. నానా రకాల అబద్ధాలు ఆడి ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌రావు ( Raghunandan Rao ) ఒక్క పని చేయకున్న.. మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాడు. అబద్ధాలు చెప్పే రఘునందన్‌రావును నమ్మకండి. కేసీఆర్ వస్తే తొగుట మండలంలో భూములు, ఊర్లు గుంజుకుంటాడని రఘునందన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. భూములు ఎక్కడికి పోవు ప్రజలు భయపడవద్దు. ఓట్లకోసం పబ్బం గడిపే వారి మాటలు నమ్మకండి. తొగుట మండలంలో ఏ ఒక్క ఊరు పోయిన నేను రాజీనామా చేస్తాను. రఘునందన్‌రావు లీడర్లను లక్షలు పెట్టి కొనే పనిలో పడ్డారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు త్యాగం చేసిన నిర్వాసితులకు రుణపడి ఉంటాం. కూడవెళ్లి ప్రవహిస్తోంది అంటే కేసీఆర్ పుణ్యమే.మోటార్లకు మీటర్లు పెడుతారని చెప్పే వారి మాటలు నమ్మద్దు. ఎంతమంది అవాకులు చెవాకులు చేసిన దళిత బంధు, బీసీ బంధు, సంక్షేమ పథకాలు ఆగిపోవు. కారు గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా’’ అని కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-10-29T16:53:43+05:30 IST