Share News

CM Himanta Biswasharma: బీజేపీ అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తాం

ABN , First Publish Date - 2023-11-22T23:15:53+05:30 IST

బీజేపీ ( BJP ) అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswasharma ) పేర్కొన్నారు.

CM Himanta Biswasharma: బీజేపీ అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తాం

చార్మినార్: బీజేపీ ( BJP ) అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswasharma ) పేర్కొన్నారు. బుధవారం నాడు పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘ హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తాం. త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకొస్తాం. ఒకరికి ఒక భార్యనే ఉండాలి. ముస్లిం సమాజం కూడా దీనికి మద్దతు ఇస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక వర్గానికి మాత్రమే మద్దతిస్తుంది. బీజేపీ దేశం కోసం ఆలోచిస్తుంది. అస్సాంలో మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చాం. ఓ వర్గం కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేయడం లేదు. నిన్న పోలీసులపై ఎంఐఎం నేతల దౌర్జన్యాన్ని చూశాను.బీజేపీ ప్రభుత్వం ఉంటే అలా చేయగలరా. మార్పు కావాలనుకుంటే బీజేపీ రావాలి’’ అని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-22T23:15:55+05:30 IST