Share News

Bandi Sanjay: గంగుల…. నీలెక్క గుట్టలు మాయం చేశానా?.. సోయుండే మాట్లాడుతున్నావా?

ABN , First Publish Date - 2023-11-17T13:20:27+05:30 IST

Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Bandi Sanjay: గంగుల…. నీలెక్క గుట్టలు మాయం చేశానా?.. సోయుండే మాట్లాడుతున్నావా?

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌పై (Minister Gangula Kamalakar) బీజేపీ నేత బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గంగుల…. నీలెక్క నేను గుట్టలు మాయం చేశానా? భూకబ్జాలు చేశానా? పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి నువ్వే. కరప్షన్‌లో కరీంనగర్ టాప్ అని నిఘా నివేదికలే చెబుతున్న సోయి లేదా? నీకు బి.ఫాం ఇవ్వకుండా సతాయించింది నిజం కాదా. నేను అధికారంలోనే లేను… నిరంతరం పోరాటాలే చేసిన. నేను అవినీతికి ఎలా పాల్పడతా?... సోయిండే మాట్లాడుతున్నవా. బీజేపీ నన్ను గౌరవించింది. హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయిస్తోంది.. ఆ సంగతి నీకు తెల్వదా. అసలు నువ్వు… కరీంనగర్ ప్రజలకు ఒరగబెట్టిందేమిటి. రేషన్ కార్డు నీ చేతిలో పనే… ఎందుకివ్వలేదు. వడ్ల కొనుగోలు నీ శాఖదే… అక్రమాలు ఎందుకు ఆపలేదు’’ అంటూ గంగుల కమలాకర్‌ను బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-17T13:20:29+05:30 IST