Share News

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

ABN , First Publish Date - 2023-11-23T22:47:03+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు. గురువారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ నుంచి బోరబండ డివిజన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీతోపాటు ఎంఐఎం జూబ్లీహిల్స్ అభ్యర్థి రాషత్ ఫరాజ్ ఉద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ...‘‘ఈ ఎన్నికల్లో ఎంఐఎం జూబ్లీహిల్స్ నుంచి గెలుపు కొరకు పోటీ చేస్తుంది. చంద్రాయన్ గుట్ట నుంచి వచ్చి నేను ఇక్కడ తమ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కొన్ని శక్తులు తమ పార్టీని తొక్కాలని చూస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి మాత్రం ఏమి జరగలేదు. ఇక్కడ మాత్రం పోటీ చేసేది కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు కానీ జూబ్లీహిల్స్‌లో గెలిచేది మాత్రం ఎంఐఎం పార్టీనే. 30వ తేదీ నాడు అందరూ పతంగ్ గుర్తుకు ఓటు వేయాలి’’ అని అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-23T22:47:12+05:30 IST