Share News

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెంచరీలు చేసింది వీళ్లే..!!

ABN , First Publish Date - 2023-10-17T17:52:28+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో అంచనాలకు తగ్గట్లుగా స్టార్ ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేస్తున్నారు. మొత్తంగా అన్ని జట్ల నుంచి ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదయ్యాయి.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెంచరీలు చేసింది వీళ్లే..!!

వన్డే ప్రపంచకప్ అంచనాలకు భిన్నంగా సాగుతోంది. టోర్నీకి ముందు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు వెళ్తాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రపంచకప్ ప్రారంభంలోనే ఇబ్బందులు పడ్డాయి. ఇంగ్లండ్ అయితే పసికూన ఆప్ఘనిస్తాన్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అంచనాలకు తగ్గట్లుగా స్టార్ ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో సెంచరీలు నమోదు చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఇంకా సెంచరీ రాకపోయినా ఇంగ్లండ్ నుంచి ఒక సెంచరీ అయితే నమోదైంది. మొత్తంగా అన్ని జట్ల నుంచి ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: Cricket: SMATలో రికార్డు స్కోరు.. 20 ఓవర్లలో 275 పరుగులు

న్యూజిలాండ్ నుంచి డెవాన్ కాన్వే (152), రచిన్ రవీంద్ర (123) సెంచరీలు కొట్టారు. దక్షిణాఫ్రికా నుంచి డికాక్ ఒక్కడే రెండు సెంచరీలు చేశాడు. శ్రీలంకపై (100 నాటౌట్), ఆస్ట్రేలియాపై (109) అతడు సెంచరీలు నమోదు చేశాడు. డికాక్‌తో పాటు డుస్సెన్, మార్‌క్రమ్ కూడా సెంచరీలు అందుకున్నారు. వీళ్లిద్దరూ శ్రీలంకపై సెంచరీలతో చెలరేగారు. టీమిండియా నుంచి రోహిత్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘనిస్తాన్‌పై అతడు ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి డేవిడ్ మలాన్ (140) సెంచరీ మార్క్ అందుకున్నాడు. శ్రీలంక నుంచి కుశాల్ మెండిస్ (122), సమరవిక్రమ (108) మూడంకెల స్కోరు సాధించారు. పాకిస్థాన్ నుంచి అబ్దుల్లా షఫీఖ్ (113), మహ్మద్ రిజ్వాన్ (133) సెంచరీలు చేశారు. కాగా గిల్, కోహ్లీ, స్మిత్, వార్నర్, మ్యాక్స్‌వెల్, బాబర్ ఆజమ్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా సెంచరీలు బాదాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-10-17T17:52:28+05:30 IST