Share News

IPL 2024 Auction: వేలం ముగిశాక ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే..?

ABN , Publish Date - Dec 20 , 2023 | 09:15 AM

IPL 2024: ఐపీఎల్ 2023 వేలం ముగిసింది. మినీ వేలం అనే పేరే కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మురించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(రూ.24.75)ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.

IPL 2024 Auction: వేలం ముగిశాక ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే..?

దుబాయ్: ఐపీఎల్ 2023 వేలం ముగిసింది. మినీ వేలం అనే పేరే కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మురించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(రూ.24.75)ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. మరో ఆసీస్ పేపర్ ప్యాట్ కమిన్స్(20.50)ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు దక్కించుకుంది. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 5 ఆటగాళ్లలో టీమిండియా నుంచి ఒకరికి మాత్రమే చోటు దక్కింది. అయితే వేలం ముగిశాక ఏ జట్టు వద్ద ఇంకా ఎంత డబ్బు మిగిలిందో ఒకసారి పరిశీలిద్దాం. అత్యధికంగా ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.9.9 కోట్లు ఉండగా.. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.20 లక్షలు ఉన్నాయి.

చెన్నైసూపర్ కింగ్స్

ఈ వేలంలో చెన్నైసూపర్ కింగ్స్ రచిన్ రవీంద్ర (రూ.1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ.4 కోట్లు), డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు), సమీర్ రిజ్వి (రూ.8.4 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.2 కోట్లు), అవనీష్ రావు అరవెల్లి (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఆ జట్టు దగ్గర ఇంకా కోటి రూపాయలు మిగిలి ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్

ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ (రూ.4 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.50 లక్షలు), రికీ భుయ్ (రూ.20 లక్షలు), కుమార్ కుషాగ్రా (రూ.7.2 కోట్లు), రసిఖ్ సలామ్ (రూ.20 లక్షలు), రిచర్డన్సన్ (రూ. 5 కోట్లు), సుమిత్ కుమార్ (రూ. కోటి), షాయ్ హోప్ (రూ.75 లక్షలు), స్వస్తిక్ చికారా (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా రూ.9.9 కోట్లు మిగిలి ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్

ఈ వేలంలో గుజరాత్ టైటాన్స్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ.50 లక్షలు), ఉమేష్ యాదవ్ (రూ.5.8 కోట్లు ), షారుక్ ఖాన్ (రూ.7.4 కోట్లు), సుశాంత్ మిశ్రా (రూ.2.2 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ.60 లక్షలు), మానవ్ సుతార్ (రూ.20 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ.10 కోట్లు), రాబిన్ మింజ్ (రూ.3.6 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా రూ.7.85 కోట్లు మిగిలి ఉన్నాయి.

కోల్‌కతానైట్ రైడర్స్

ఈ వేలంలో కోల్‌కతానైట్ రైడర్స్ కేఎస్ భరత్ (రూ.50 లక్షలు), చేతన్ సకారియా (రూ.50 లక్షలు), మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు), అంగ్క్రిష్ రాఘవన్షి (రూ.20 లక్షలు), రమణదీప్ సింగ్ (రూ.20 లక్షలు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (రూ.1.5 కోట్లు), మనీష్ పాండే (రూ.50 లక్షలు), ముజీబ్ ఉర్ రెహమాన్ (రూ.2 కోట్లు) , గస్ అట్కిన్సన్ (రూ.1 కోట్లు), సాకిబ్ హుస్సేన్ (రూ.20 లక్షలు) లను కొనుగోలు చేసింది. ఆ జట్టు దగ్గర ఇంకా రూ.1.35 కోట్లు మిగిలి ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్

ఈ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు శివం మావి (రూ.6.4 కోట్లు), అర్షిన్ కులకర్ణి (రూ.20 లక్షలు), ఎం సిద్ధార్థ్ (రూ.2.4 కోట్లు), అష్టన్ టర్నర్ (రూ.ఒక కోటి), డేవిడ్ విల్లీ (రూ.2 కోట్లు), అర్షద్ ఖాన్ (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఆ జట్టు దగ్గర ఇంకా రూ.95 లక్షలు ఉన్నాయి.


ముంబై ఇండియన్స్

ఈ వేలంలో ముంబై ఇండియన్స్ జెరాల్డ్ కోయెట్జీ (రూ.5 కోట్లు), దిల్షన్ మధుశంక (రూ.4.6 Cr), శ్రేయాస్ గోపాల్ (రూ.20 లక్షలు), నువాన్ తుషార (రూ.4.8 కోట్లు), అన్షుల్ కాంబోజ్ (రూ.20 లక్షలు), నమన్ ధీర్ (రూ.20 లక్షలు), మొహమ్మద్ నబీ (రూ.1.5 కోట్లు), శివాలిక్ శర్మ (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఆ జట్టు దగ్గర ఇంకా రూ.1.05 కోట్లు మిగిలి ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్

ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ హర్షల్ పటేల్ (రూ.11.75 కోట్లు), క్రిస్ వోక్స్ (రూ.4.2 కోట్లు), అశుతోష్ శర్మ (రూ.20 లక్షలు), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ.20 లక్షలు) , శశాంక్ సింగ్ (రూ.20 లక్షలు), ప్రిన్స్ చౌదరి (రూ.20 లక్షలు), తనయ్ త్యాగరాజన్ (రూ.20 లక్షలు), రిలీ రోసౌ (రూ.8 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా రూ.4.15 కోట్లు మిగిలి ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్

ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ రోవ్‌మన్ పావెల్ (రూ.7.4 కోట్లు), శుభమ్ దూబే (రూ.5.8 కోట్లు), టామ్ కోహ్లర్-కాడ్‌మోర్ (రూ.40 లక్షలు), అబిద్ ముస్తాక్ (రూ.20 లక్షలు) ), నాంద్రే బర్గర్ (రూ.50 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఆ జట్ట దగ్గర ఇంకా రూ.20 లక్షలు ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఈ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అల్జారీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), యష్ దయాల్ (రూ.5 కోట్లు), టామ్ కర్రాన్ (రూ.1.5 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా రూ.2.85 కోట్లు మిగిలి ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్రావిస్ హెడ్ (రూ.6.8 కోట్లు), వనిందు హసరంగా (రూ.1.5 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ.20.5 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (రూ.1.6 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ.20 లక్షలు), ఝాతవేద్ సుబ్రమణ్యన్ (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ దగ్గర ఇంకా రూ.3.2 కోట్లు మిగిలి ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 09:15 AM