Controversy: మైదానంలో మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-09-04T19:31:35+05:30 IST

ఆసియా కప్‌లో పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా గంభీర్ మైదానంలో నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా కోహ్లీ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గంభీర్‌ను చూసి కావాలనే కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. దీంతో గంభీర్ వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Controversy: మైదానంలో మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్.. వీడియో వైరల్

టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌పై విరాట్ కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాములుగానే కోహ్లీ, గంభీర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉంటాయి. మొన్నటికి మొన్న ఐపీఎల్‌లో వాళ్లిద్దరి వ్యవహారశైలి వివాదాలకు దారి తీసింది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా గంభీర్, కోహ్లీ ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టుకోవడానికి చాలా దగ్గర వరకు వెళ్లడం కెమెరాల కంట పడింది. తాజాగా ఆసియా కప్‌లో పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా గంభీర్ మైదానంలో నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా కోహ్లీ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గంభీర్‌ను చూసి కావాలనే కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. దీంతో గంభీర్ వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో గంభీర్‌కు అంత కోపం పనికిరాదని కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో గంభీర్ ప్రవర్తన చెత్తగా ఉంటోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ స్టార్ ఇమేజ్‌ను చూసి అతడు ఓర్వలేకపోతున్నాడని సెటైర్లు వేస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఇతర క్రికెటర్లను గౌరవించుకోవడం నేర్చుకోవాలని గంభీర్‌కు కోహ్లీ అభిమానులు హితవు పలుకుతున్నారు. మరోవైపు కావాలనే గంభీర్‌ను కోహ్లీ అభిమానులు టార్గెట్ చేశారని.. పైగా అక్కడ కోహ్లీ లేకపోయినా నినాదాలు చేశారని.. దీంతో వాళ్లకు గంభీర్ చెక్ పెట్టాడని అతడి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: టీమిండియా చెత్త ఫీల్డింగ్.. మూడు క్యాచ్‌లు నే(ల)పాలు

కాగా ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్లను విరాట్ కోహ్లీ కౌగిలించుకోవడాన్ని చూసిన గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవైపు భారత్-పాకిస్థాన్ అభిమానులు మ్యాచ్ కోసం శత్రువుల్లా మారి తమ దేశం పరువు నిలపాలని నినాదాలు చేస్తుంటే.. పలువురు క్రికెటర్లు మైదానంలో చెట్టాపట్టాలేసుకుని నవ్వుకోవడం, కౌగిలించుకోవడం మంచిది కాదని సూచించాడు. వాళ్లు స్నేహపూర్వకంగా ఉండటం తప్పు కాదని.. స్నేహం చేయాలని, ప్రేమతో మాట్లాడుకోవాలని భావిస్తే మైదానం బయటే అలా ఉండాలని.. మైదానంలో బరిలోకి దిగిన తర్వాత మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌ ఛానల్‌కు క్రికెట్ విశ్లేషకుడిగా గౌతమ్ గంభీర్ పనిచేస్తున్నాడు.

Updated Date - 2023-09-04T19:31:35+05:30 IST