కొట్టేందుకు వెంటపడుతున్న ఇద్దరు యువకులు.. పరుగులు తీస్తూ బావిలోకి దూకేసిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-19T18:34:20+05:30 IST

కొందరు యువకులు ఓ యువతిపై దాడి చేసేందుకు పట్టపగలు నేరుగా ఆమె ఇంటికే వెళ్లారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన యువతి.. ఇంటి నుంచి బయటికి పారిపోయింది. అయినా వదలని వారు.. ఆమెను వెంబడిస్తూ..

కొట్టేందుకు వెంటపడుతున్న ఇద్దరు యువకులు.. పరుగులు తీస్తూ బావిలోకి దూకేసిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు యువకులు ఓ యువతిపై దాడి చేసేందుకు పట్టపగలు నేరుగా ఆమె ఇంటికే వెళ్లారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన యువతి.. ఇంటి నుంచి బయటికి పారిపోయింది. అయినా వదలని వారు.. ఆమెను వెంబడిస్తూ వెళ్లారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి చివరకు ఓ బావిలో దూకేసింది. అసలు విషయం తెలుసుకుని గ్రామస్తులు చివరకు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

Viral Video: పెళ్లి పీటలపై ఉండాల్సిన అమ్మాయి మెట్రో రైల్లో ప్రత్యక్ష్యం.. అసలేం జరిగిందో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

attak-on-young-women.jpg

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) బెతుల్ పరిధి బోర్దేహి సమీప ప్రాంతంలోని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతిని (young woman) ఇటీవల ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నామంటూ వెంటబడేవారు. అయినా యువతి వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించింది. దీంతో యువతిపై సదరు యువకులు పగ పెంచుకున్నారు. ఇటీవల ఇద్దరూ యువకులు కలిసి మాట్లాడుకుని, మరో ముగ్గురు స్నేహితులను తీసుకుని యువతి గ్రామానికి వెళ్లారు. కత్తులు, కర్రలతో ఆమె ఇంట్లోకి వెళ్లారు. వెళ్లీవెళ్లగానే యువతిపై దాడి (attack) చేసేందుకు ప్రయత్నించారు. వారిని చూడగానే యువతి.. భయంతో బయటికి పరుగులు తీసింది. ఆమె వెనుకే యువకులు కూడా పరుగెత్తుకుంటూ వెళ్లారు.

అత్తారింట్లో అల్లుడి హైడ్రామా.. పుట్టింటికి వెళ్లి తిరిగి రానంటున్న భార్య కోసం ఆ భర్త ఎంతకు తెగించాడంటే..

వీరిని గమనించిన గ్రామస్తులు.. ఏం జరుగుతుందో అర్థం కాక వారిని అనుసరించారు. యువకుల నుంచి తప్పించుకునే క్రమంలో యువతి.. సమీపంలోని ఓ బావిలో దూకేసింది. స్థానికులు అక్కడికి రావడాన్ని గుర్తించిన యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు వారిలో ఇద్దరిని పట్టుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: ఫొటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కాడు.. తర్వాత ఏమైందంటే..

Updated Date - 2023-01-19T18:39:28+05:30 IST