Viral Video: ఈ కుర్రాడి టాలెంట్ అదుర్స్.. మెట్రో రైల్లో కూర్చుని అతడు మాట్లాడింది వింటే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-05-17T11:04:20+05:30 IST

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ మెట్రోకు (Delhi Metro) సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఈ కుర్రాడి టాలెంట్ అదుర్స్.. మెట్రో రైల్లో కూర్చుని అతడు మాట్లాడింది వింటే అవాక్కవడం ఖాయం..!

Viral Video: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ మెట్రోకు (Delhi Metro) సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఈ మెట్రో దాని ప్రత్యేకతల కంటే కూడా అక్కడ కొందరు పోకిరీలు చేస్తున్న పిచ్చి చేష్టల కారణంగా బాగా వార్తల్లో నిలుస్తోంది. రెండు మూడు రోజులకు ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో (Social Media) హల్‌చల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ఇదే కోవలో మరో వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈసారి వీడియో ఓ కుర్రాడి అద్భుతమైన టాలెంట్‌కు సంబంధించినది కావడం విశేషం. ఇంతకుముందు వీడియోలకు ఇది పూర్తి భిన్నం అనే చెప్పాలి. ఇక వీడియోలో ఆ యువకుడు మెట్రో రైల్లో కూర్చుని మాట్లాడింది వింటే అవాక్కవడం ఖాయం.

గత 20 ఏళ్లలో ఢిల్లీ మెట్రో నగరానికి లైఫ్‌లైన్‌గా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలక్రమేణా చాలా మార్పులు వచ్చాయి. కానీ కోచ్‌లలో రోజువారీ ప్రకటనల వెనుక వినిపించే గొంతు (వాయిస్) అలాగే ఉంటుంది. మెట్రోకు పర్యాయపదంగా మారిన ఆ వాయిస్ షమ్మీ నారంగ్, రినీ సైమన్ ఖన్నాలది (Rini Simon Khanna). ఇప్పటి వరకు చాలా మంది అతడి వాయిస్‌ని కాపీ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఏ ఒక్కరూ ఆ వాయిస్‌ను మ్యాచ్ చేయలేకపోయారు. అయితే, ఇప్పుడు ఓ యువకుడు దాన్ని సాధించాడు. అతడి పేరు కృష్ణాష్ శర్మ. ఢిల్లీ మెట్రో ప్రకటనలపై వచ్చే షమ్మీ నారంగ్ (Shammi Narang) వాయిస్‌ను అచ్చుగుద్దినట్టుగా మాట్లాడుతున్నాడు. దాంతో కృష్ణాష్ శర్మ తన వాయిస్‌తో వైరల్ అవుతున్నాడు. రైల్లో కూర్చుని అతడు చేసిన మెట్రో ప్రకటన తాలూకు వీడియో బయటకు రావడంతో ఇప్పుడు అది కాస్త వైరల్‌గా మారింది. అతడి వాయిస్ విన్న ప్రతిఒక్కరూ నిజంగా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. 'మీరు త్వరలోనే చాలా ఫేమస్ అయిపోతారు చూడండి' అంటూ కామెంట్ చేస్తున్నారు.

Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. పెట్రోల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-05-17T11:04:20+05:30 IST