అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. గొర్రెల కాపరులు వెళ్తే చెట్ల పొదల్లో షాకింగ్ సీన్.. మాజీ ప్రియుడితో కలిసి ఓ యువతి నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2023-02-08T19:30:44+05:30 IST

యువతీయువకులు ప్రేమలో ఉన్న సమయంలో అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కులం విషయంలో, మరికొన్ని సార్లు తల్లిదండ్రులు, ఇంకొన్ని సార్లు వివాహ రూపంలో సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవల..

అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. గొర్రెల కాపరులు వెళ్తే చెట్ల పొదల్లో షాకింగ్ సీన్.. మాజీ ప్రియుడితో కలిసి ఓ యువతి నిర్వాకమిదీ..!
ప్రతీకాత్మక చిత్రం

యువతీయువకులు ప్రేమలో ఉన్న సమయంలో అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కులం విషయంలో, మరికొన్ని సార్లు తల్లిదండ్రులు, ఇంకొన్ని సార్లు వివాహ రూపంలో సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కలు అదే పనిగా అరుస్తుండడంతో గొర్రెల కాపరులకు అనుమానం వచ్చింది. ముళ్ల పొదల్లో చూడగా షాకింగ్ దృశ్యం కంటపడింది. చివరకు ఓ యువతి మాజీ ప్రియుడితో కలిసి చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అజంగఢ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రామ్, ప్రదీప్.. అన్నదమ్ములు. ప్రదీప్‌కు ముబారక్‌పూర్ పరిధి మాగాపూర్‌కు చెందిన యువతితో (young woman) వివాహమైంది. కాగా, ప్రదీప్ ప్రస్తుతం ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. రామ్ తరచూ తన అన్న అత్తమామల ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రదీప్‌కు వరుసకు మరదలు అయ్యే రబీనా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమకు (Love with young woman) దారి తీసింది. మొదట్లో ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవల రుబీనా పదే పదే పెళ్లి ప్రస్తావన తెస్తూ ఉండేది. అయితే రామ్ మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు. దీంతో ఇటీవల ఇదే విషయమై రామ్‌ను రుబీనా గట్టిగా నిలదీసింది.

భార్య కట్నం అందకపోవడంతో.. స్నేహితులను ఇంటికి తీసుకెళ్లిన భర్త.. చివరకు తల్లితో కలిసి చేసిన నిర్వాకం తెలిస్తే..

Uttar-pradesh-crime-news.jpg

అయినా రామ్ ఒప్పుకోకపోవడంతో అతడిపై కోపం పెంచుకుంది. ఎలాగైనా రామ్‌ను అంతమొందిచాలని నిర్ణయించుకుంది. తన మాజీ ప్రియుడు రవీంద్రతో మాట్లాడి, ఇద్దరూ కలిసి పక్కా పథకం (murder conspiracy) పన్నారు. ఇటీవల ఓ రోజు రామ్‌ను ఊరి బయటకు పిలిచింది. అక్కడికి వచ్చిన ప్రియుడితో పెళ్లి విషయమై మళ్లీ గొడవ పడింది. ఈ క్రమంలో మధ్యలో అక్కడికి వచ్చిన రుబీనా మాజీ ప్రియుడు రవీంద్ర.. గడ్డ పారతో రామ్‌పై దాడి చేశాడు. దీంతో రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత కుక్కలు పదే పదే అరుస్తుండడంతో గొర్రెల కాపరులకు అనుమానం వచ్చి చూడగా మృతదేహం బయటిపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరకు రుబీనా, ఆమె మాజీ ప్రియుడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

బాగా దగ్గు వస్తోందంటూ క్లినిక్‌కు వెళ్లిన 21 ఏళ్ల యువతి.. ఇంజెక్షన్ చేయగానే నీలి రంగులోకి మారిన శరీరం.. చివరకు..

Updated Date - 2023-02-08T19:30:47+05:30 IST