నా ప్రేయసిని పెళ్లి చేసుకోవద్దంటూ.. ఎంగేజ్మెంట్‌లోనే వరుడికి ప్రియుడి వార్నింగ్.. నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-01-18T16:12:07+05:30 IST

వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుకోకుండా యువతికి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. నేరుగా..

నా ప్రేయసిని పెళ్లి చేసుకోవద్దంటూ.. ఎంగేజ్మెంట్‌లోనే వరుడికి ప్రియుడి వార్నింగ్.. నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుకోకుండా యువతికి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. నేరుగా అక్కడికే వెళ్లాడు. నా ప్రేయసిని పెళ్లి చేసుకోవద్దంటూ.. ఎంగేజ్మెంట్‌లోనే వరుడికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన జరిగిన నాలుగో రోజే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఝాన్సీ పరిధి తల్పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరుణ్ అనే వ్యక్తి.. స్థానికంగా టీ దుకాణం (Tea shop) నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం బార్‌గావ్ గేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం (love) నడుస్తోంది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో జనవరి 8న యువతికి నిశ్చితార్థం (Engagement) ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్.. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. లోపలికి వెళ్లి.. అందరి ముందూ ‘‘ తను నా ప్రేయసి, తనను పెళ్లి (marriage) చేసుకోవద్దు’’.. అంటూ హెచ్చరించాడు. దీంతో కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది.

డబ్బులు తీసుకుని పరాయి వ్యక్తులను భార్య వద్దకు పంపిన భర్త.. ఓ రోజు స్థానికులు వెళ్లి ఉడుకుతున్న బానలిలో చూడగా..

lovers.jpg

అందరి ముందూ పరువు పోవడాన్ని.. యువతి సోదరులు అంకిత్ బాతం, నితిన్ బాతం జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా అరుణ్‌ను చంపి, ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. కొంత మంది స్నేహితులను పిలిచి అరుణ్ హత్యకు కుట్ర పన్నారు. జనవరి 12న టీ దుకాణం మూసేసి, ఇంటికి వస్తున్న అరుణ్‌పై దాడి (attack) చేశారు. అనంతరం అతడికి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి.. ఓ నదిలో పడేశారు. కొడుకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 15న మృతదేహాన్ని స్వాధీంన చేసుకున్నారు. యువతి సోదరులతో పాటూ మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భార్య దూరంగా ఉండడంతో.. మరో ఇంటి తలుపు తట్టిన వ్యక్తి.. బయటికి వచ్చిన ఆమె ముందే..

Updated Date - 2023-01-18T16:12:12+05:30 IST