తమ సంఘం నుంచి బయటికి వెళ్లడంతో.. 50 మంది మహిళలు కలిసి మూకుమ్మడిగా ఒకే వ్యక్తిపై..

ABN , First Publish Date - 2023-01-07T19:30:53+05:30 IST

నడిరోడ్డుపై అంతా చూస్తుండగా సుమారు 50 మంది మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమ సంఘం నుంచి బయటికి వెళ్లాడనే కోపంతో ఓ వ్యక్తిని టార్గెట్ చేశారు. మూకుమ్మడిగా అతడిపై..

తమ సంఘం నుంచి బయటికి వెళ్లడంతో.. 50 మంది మహిళలు కలిసి మూకుమ్మడిగా ఒకే వ్యక్తిపై..

నడిరోడ్డుపై అంతా చూస్తుండగా సుమారు 50 మంది మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమ సంఘం నుంచి బయటికి వెళ్లాడనే కోపంతో ఓ వ్యక్తిని టార్గెట్ చేశారు. మూకుమ్మడిగా అతడిపై దాడికి తెగబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

తమ్ముడూ.. నా పిల్లల బాధ్యత నీదే.. బాగా చూసుకో.. అంటూ వీడియో పంపించి మరీ ఓ వ్యక్తి దారుణం.. అసలేం జరిగిందంటే..

కేరళలోని (Kerala) త్రిస్సూర్ ఎంపరర్ ఇమ్మాన్యుయేల్ రిట్రీట్ సెంటర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన షాజీ అనే వ్యక్తి.. ఇక్కడే ఉన్న చర్చి సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు. అయితే ఇటీవల సదరు సంఘం నుంచి బయటికి వచ్చాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ రోజు షాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా.. సుమారు 50మంది మహిళలు చుట్టుముట్టారు. షాజీని కారు నుంచి బయటికి లాగి.. మూకుమ్మడిగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడి కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి, కారు అద్దాలను ధ్వంసం చేశారు.

బ్యాగులో లక్ష రూపాయల నోట్ల కట్టలు.. కానీ నడిరోడ్డుపై బ్లేడుతో కోసుకుని ఓ యువకుడు దారుణం.. చివరకు..

బాధితుడి ఫిర్యాదు మేరకు.. పోసులు కేసు నమోదు చేశారు. కాగా, చర్చి ఫాదర్ ఫొటోను మార్పింగ్ చేశాడనే కారణంతో షాజీపై దాడి చేసినట్లు మహిళలు తెలిపారు. మరోవైపు సదరు మహిళపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సంఘం నుంచి బయటికి వెళ్లిన వారిపై గతంలోనూ ఇలాగే పలుమార్లు దాడులు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం మహిళలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

Updated Date - 2023-01-07T19:31:36+05:30 IST