పురిటి నొప్పులతో ఓ మైనర్ బాలిక మృతి.. ఆసుపత్రికి వచ్చిన పోలీసులకు షాకింగ్ ట్విస్ట్.. రెండేళ్ల క్రితం నాటి కేసులో..

ABN , First Publish Date - 2023-01-05T17:59:35+05:30 IST

కడుపుతో ఉన్న ఓ బాలికకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శిశువుతో పాటూ బాలిక కూడా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు..

పురిటి నొప్పులతో ఓ మైనర్ బాలిక మృతి.. ఆసుపత్రికి వచ్చిన పోలీసులకు షాకింగ్ ట్విస్ట్.. రెండేళ్ల క్రితం నాటి కేసులో..

కడుపుతో ఉన్న ఓ బాలికకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శిశువుతో పాటూ బాలిక కూడా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. ఈ విచారణలో అనూహ్యంగా రెండేళ్ల క్రితం నాటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

గొయ్యిలో ఓ యువకుడి మృతదేహం.. అడక్కుండానే సాయం చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు డౌట్.. పచ్చబొట్టుతో వీడిన మిస్టరీ..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అయోధ్య పరిధి సైద్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ బాలికకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శిశువుతో పాటూ బాలిక కూడా మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో రెండేళ్ల క్రితం మృతురాలు కిడ్నాప్‌కు (Kidnapping case) గురైనట్లు గుర్తించారు.

కార్లు, బైకులతో ప్రమాదకర స్టంట్స్.. రూ.30 చెల్లించి మరీ చావు అంచును చూసొస్తున్నారు..!

రిషికేశ్‌కు (Rishikesh) చెందిన బాలికను రెండేళ్ల క్రితం అనిల్ కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి, వివాహం చేసుకున్నాడు. అప్పట్లో పోలీసులు ఈ ఘటనపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి బాలిక అతడి వద్దే ఉన్నట్లు తెలిసింది. ఇటీవల గర్భం దాల్చిన బాలికకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను అనిల్ కుమార్.. ఆస్పత్రికి తరలించాడు. అనంతరం బంధువులకు సమాచారం అందించాడు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అనిల్ కుమార్‌పై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..

Updated Date - 2023-01-05T17:59:42+05:30 IST