భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..

ABN , First Publish Date - 2023-01-04T20:29:35+05:30 IST

పేరుకు సవతి తండ్రి అయినా కూతురుని ఎంతో బాగా చూసుకునేవాడు. యువతి కూడా అతన్ని సొంత తండ్రిలానే భావించేది. అయితే కొన్నాళ్లకు అతడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కూతురు పట్ల అతడు ప్రవర్తించిన తీరుకు...

భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

పేరుకు సవతి తండ్రి అయినా కూతురుని ఎంతో బాగా చూసుకునేవాడు. యువతి కూడా అతన్ని సొంత తండ్రిలానే భావించేది. అయితే కొన్నాళ్లకు అతడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కూతురు పట్ల అతడు ప్రవర్తించిన తీరుకు ఆమెకు చివరకు విరక్తి కలిగింది. ఇటీవల కూతురుకు వివాహమైనా కూడా తండ్రి తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో చివరకు ఓ రోజు భర్తతో మాట్లాడి సవతి తండ్రికి టీ ఇచ్చింది. కాసేపటి తర్వాత ఆ దంపతులు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో పరిధి దుబాగ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman) తన సవతి తండ్రి వద్ద ఉంటోంది. అతను పేరుకు సవతి తండ్రి అయినా చాలా బాగా చూసుకునేవాడు. దీంతో సదరు యువతి కూడా అతన్ని సొంత తండ్రిలా భావించేది. ఇదిలావుండగా, ఇటీవల సదరు యువతి పట్ల సవతి తండ్రి ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె నోరు మూసి అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా రోజూ ఆమెపై అత్యాచారం చేస్తూ ఉండేవాడు. బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో అలాగే భరిస్తూ వచ్చింది. ఇటీవల ఆమెకు వివాహమైంది. అయినా సవతి తండ్రి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు.

కలుద్దామంటూ న్యూఇయర్ రోజున ప్రేయసి నుంచి ఆహ్వానం.. ఆమెను కలిసిన మరుక్షణంలోనే అతడికి ఊహించని షాక్..

దీంతో చివరకు ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. చివరకు ఇద్దరూ కలిసి పక్కా పథకం వేశారు. ఓ రోజు తండ్రికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చింది. అది తాగిన కొద్ది సేపటికి అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత భార్యాభర్తలు కలిసి.. తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తలపై అనుమానం రావడంతో అదుపులోకి విచారించారు. చివరకు నేరం అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గ్యాంగ్ రేప్ జరిగినా కుంగిపోలేదు.. ఒకప్పుడు బార్లలో డ్యాన్సులు.. ప్రస్తుతం మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్..

Updated Date - 2023-01-04T20:38:25+05:30 IST