భర్త ఆదాయం సరిపోలేదని విసిగిపోయిన భార్య.. తల్లి సాయంతో ఆమె చేసిన పని తెలుసుకుని అవాక్కైన భర్త.. చివరకు..

ABN , First Publish Date - 2023-01-20T18:18:45+05:30 IST

విలాసాలకు అలవాటు పడిన వారు.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వివిధ అక్రమ మార్గాలను ఎంచుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఇందులో ఎక్కువగా మగవారే ఉంటారు. అయితే అప్పుడప్పుడూ మహిళలు కూడా..

భర్త ఆదాయం సరిపోలేదని విసిగిపోయిన భార్య.. తల్లి సాయంతో ఆమె చేసిన పని తెలుసుకుని అవాక్కైన భర్త.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

విలాసాలకు అలవాటు పడిన వారు.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వివిధ అక్రమ మార్గాలను ఎంచుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఇందులో ఎక్కువగా మగవారే ఉంటారు. అయితే అప్పుడప్పుడూ మహిళలు కూడా పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా, గుజరాత్‌లో ఓ మహిళ ఇలాగే చేసింది. విలాసవంతమైన జీవితానికి అవాటు పడిన ఓ మహిళ.. తన భర్త ఆదాయం సరిపోకపోవడంతో విసిగిపోయింది. చివరకు తన తల్లి సాయంతో ఆమె చేసిన పని తెలుసుకుని భర్త షాక్ అయ్యాడు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: హోటళ్లలో రోటీలను లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

గుజరాత్ (Gujarat) అమ్రైవాడీ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనిత అనే మహిళకు ఐదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. అనితకు ముందు నుంచీ విలాసవంతంగా జీవించడం (luxury life) అంటే ఇష్టం. వివాహమైన మొదట్లో సర్దుకుపోయినా.. తర్వాత ఆమెకు అత్తమామలతో ఉండడం నచ్చలేదు. దీంతో భర్తతో గొడవపడి వేరు కాపురం పెట్టించింది. అప్పటికైనా సవ్యంగా ఉండాల్సిన ఆమె.. ఆదాయం సరిపోలేదంటూ భర్తతో రోజూ గొడవపడేది. కొన్నాళ్లు పోతే మారుతుందిలే అనుకుని.. భర్త సర్దుకుపోయేవాడు. అయితే ఆమె ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 2019లో భార్యను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు.

ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు.. ప్రియురాలికి జాబ్ రావడంతో బెంగళూరుకు ట్రైన్ ఎక్కించి.. తర్వాత చూస్తే..

భర్త వెళ్లిపోయిన తర్వాత అనిత డబ్బుల కోసం.. తన తల్లితో మాట్లాడి సంచలన నిర్ణయం (Sensational decision) తీసుకుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సాయంతో తన అండాలను విక్రయించడానికి (Sale of eggs) పూనుకుంది. ఇందుకు తన భర్త అంగీకరించినట్లుగా ఫోర్జరీ పత్రాలను (Forgery documents) సృష్టించారు. 2022 వరకు ఆమె పలుమార్లు తన అండాలను విక్రయించింది. అయితే ఇటీవల అనిత తన భర్తతో కలిసిపోయింది. ఇలావుండగా, భార్య తన అండాలను విక్రయించినట్లు తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు. విషయం బయటపడేసరికి.. చివరకు భర్తనే బెదిరించసాగింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు.. అనితతో సహా మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Viral Video: ఇది మరీ దారుణం.. ఓ వైపు బైక్‌పై వెళ్తూ.. మరోవైపు అందరి ముందూ ఈ ప్రేమికులు చేస్తున్న పనులు చూడండి..

Updated Date - 2023-01-20T18:19:11+05:30 IST