Air India: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్... ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్.. రేపే ఆఖరు

ABN , First Publish Date - 2023-01-22T18:28:24+05:30 IST

దేశీయ విమాన ప్రయాణికులకు దిగ్గజ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా (AirIndia) గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 21 - 23 మధ్య ‘ఫ్లై ఎయిరిండియా సేల్’ ((FLYAI SALE) పేరిట ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ సేల్ (discount offer sale) ప్రకటించింది.

Air India: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్... ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్.. రేపే ఆఖరు

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికులకు దిగ్గజ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా (AirIndia) గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 21 - 23 మధ్య ‘ఫ్లై ఎయిరిండియా సేల్’ ((FLYAI SALE) పేరిట ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ సేల్ (discount offer sale) ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య దేశీయ ప్రయాణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు మాత్రమే లభ్యమవుతాయి. ఎయిరిండియా విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. ఎయిరిండియాకు చెందిన అధికారిక ట్రావెల్ ఏజెంట్స్ సహా అన్ని బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌ వద్ద టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రేపటితో (జనవరి 23) ఆఫర్ ముగియనుంది. ఎకానమీ క్లాసులో ఈ డిస్కౌంట్ టికెట్లు లభిస్తాయి. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్ని దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్ల వర్తిస్తుంది.

ఈ ఆఫర్‌లో ఒకవైపు ప్రయాణ ఛార్జీ రూ.1,705తో ప్రారంభమవుతుందని తెలియజేసింది. మొత్తం 49 దేశీయ గమ్యాలకు డిస్కౌంట్ ఆఫర్ వర్తించనుంది. ఢిల్లీ - ముంబై రూ.5,075, చెన్నై - ఢిల్లీ రూ.5,895, బెంగళూరు - ముంబై రూ.2,319, ఢిల్లీ - ఉదయ్‌పూర్ రూ.3,680, ఢిల్లీ - గోవా రూ.5,656, ఢిల్లీ - పోర్ట్‌బ్లెయిర్ రూ.8,690, ఢిల్లీ - శ్రీనగర్ రూ.3,730, అహ్మదాబాద్ - ముంబై రూ.1806, గోవా - ముంబై రూ.2,830, దిమాపూర్ - గువహటి రూ.1,783 కొన్ని ఈ జాబితాలో ఉన్నాయి. కాగా కరోనా మహమ్మారి నుంచి విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఎయిరిండియా టేకోవర్ తర్వాత టాటా గ్రూపు పునరుద్ధరణ ప్రణాళికలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-22T18:28:43+05:30 IST