ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

ABN , First Publish Date - 2023-01-01T20:46:37+05:30 IST

వారిద్దరూ పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం భర్త.. దూరంగా ఉండాల్సి వచ్చింది. రోజూ భార్యకు ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే..

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

వారిద్దరూ పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం భర్త.. దూరంగా ఉండాల్సి వచ్చింది. రోజూ భార్యకు ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇటీవల ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. బిజీ అని వస్తుండడంతో అనుమానం కలిగింది. విషయం తెలుసుకోవాలని భార్యకు చెప్పకుండా వచ్చేశాడు. చివరకు భార్య గురించి అసలు విషయం తెలియడంతో షాక్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: మహిళను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు.. కాసేపటికి కారు దిగి పరుగులు పెట్టారు..

బీహార్ (Bihar) జాముయ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సోనూ అనే యువకుడు.. మూడు నెలల క్రితం సరిత అనే యువతిని ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి జాముయ్‌లో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. సరిత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్‌లో నర్సుగా పని చేస్తుంటుంది. సోనూ తన భార్యను ఇక్కడే ఉంచి, ఉపాధి నిమిత్తం కేరళకు వెళ్లాడు. రోజూ భార్యకు ఫోన్లు చేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవాడు. అయితే ఇటీవల భార్యకు ఎప్పుడు ఫోన్ చేసినా, బిజీ బిజీ అని వస్తుండేది. ముందు ఎలాంటి అనుమానం లేకపోయినా.. రోజూ ఇలాగే వస్తుండడంతో అతడికి భార్యపై అనుమానం కలిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం భార్యకు చెప్పకుండా వచ్చేశాడు.

స్నేహితులతో కలిసి న్యూఇయర్ వేడుకుల్లో పాల్గొన్న యువతి.. రాత్రి అంతా నిద్రపోయాక సడన్‌గా ఆమె చేసిన పని..

young-man.jpg

ఆమె ఫోన్ పరిశీలించగా.. ముఖేష్ కుమార్ అనే యువకుడితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గట్టిగా మందలించడంతో భర్తపై కోపం పెంచుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి (boyfriend) చెప్పింది. తర్వాత అంతా కలిసి అతన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అదే రోజు రాత్రి సోనూ మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్నాడు. సుమారు 20మందితో కలిసి అక్కడికి చేరుకున్న ముఖేష్.. సోనూపై కర్రలతో దాడి (attack) చేశాడు. ఈ దాడిలో సోనూ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

కూలి పనికి వెళ్లే యువకుడికి.. యజమాని భార్యతో పరిచయం.. ఓ రోజు రాత్రి భర్తకు తెలిసి..

Updated Date - 2023-01-01T20:48:30+05:30 IST