TS BJP : అరెరే.. అమిత్ షా సాక్షిగా బండి, కిషన్ రెడ్డి ఇలా చేశారేంటబ్బా.. ఇదేందయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు..!

ABN , First Publish Date - 2023-03-12T21:33:26+05:30 IST

అవును.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి కిషన్ రెడ్డి (Bandi Sanjay, Kishan Reddy) ఇద్దరూ కేంద్ర మంత్రి అమిత్ షా (Union Minister Amith Shah) సాక్షిగా...

TS BJP : అరెరే.. అమిత్ షా సాక్షిగా బండి, కిషన్ రెడ్డి ఇలా చేశారేంటబ్బా.. ఇదేందయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు..!

అవును.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి కిషన్ రెడ్డి (Bandi Sanjay, Kishan Reddy) ఇద్దరూ కేంద్ర మంత్రి అమిత్ షా (Union Minister Amith Shah) సాక్షిగా హాయిగా నిద్రపోయారు.! ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన షా తెలంగాణ గడ్డపై (Telangana) కీలక ప్రసంగం చేస్తుంటే.. ఈ ఇద్దరికి జోలపాటలాగా అనిపించిందేమో కానీ కునుకేశారు..! అలా నిద్రలో జారుకున్నారో (Nap) లేదో ఇలా సోషల్ మీడియాలో (Social Media) ‘జోలాలీ..’ అంటూ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కామెంట్స్ అంటారా.. అబ్బో చిత్రవిచిత్రాలుగా వచ్చేస్తున్నాయ్. ముఖ్యంగా కిషన్ రెడ్డి కునుకేసిన వీడియోను.. బండి సంజయ్ ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఫొటోలు, వీడియోలు ఎక్కడివి.. నెటిజన్లు,అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో ఓ లుక్కేద్దాం రండి..!

ఇలా దొరికిపోయారు..!?

కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో రెండు రోజులు (Amith Shah Telangana Tour) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో (Hyderabad) జరిగిన 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. అక్కడున్న ఉన్నతాధికారులు, జవాన్లు ఎంతో శ్రద్ధగా వింటున్నారు. అయితే.. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రం హాయిగా నిద్రపోయారు. అది కూడా మొదటి వరుసలో కూర్చొని కునుకేయడంతో అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఇద్దరు నిద్రపోతున్న ఫొటోలను ఎవరు క్లిక్ మనిపించారో కానీ.. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో షేర్ చేసేస్తున్నారు. ఇక మీమర్స్‌ అయితే ఈ ఫొటోలతో పండుగ చేసుకుంటున్నారు.

మీకు మీరే సాటి..!

తెలంగాణ కాంగ్రెస్‌ ట్విట్టర్ (Congress) పేజీ ద్వారా కిషన్ రెడ్డి వీడియో బయటికొచ్చింది. 30 సెకన్ల వీడియోను పోస్ట్ చేసి.. ‘మంచి కునుకు ఏసిండు అన్న.. అమిత్ షా ప్రసంగంలో ముందు వరుసలో కూర్చున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాయిగా నిద్రపోతున్నారు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది కాంగ్రెస్. ఇక తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన సంతోష్ రెడ్డి.. బండి, కిషన్ ఇద్దరూ నిద్రపోతున్న ఫొటోలను స్క్రీన్ షాట్‌ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘మీకు మీరే సాటి.. మీ ఇద్దరి నిద్రకు ఎవరు లేరు పోటీ. దేశం కోసం ధర్మం కోసం మీ బీజేపీ వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు అనుకుంట..!’ అని సంతోష్ ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లపై కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నాయి. దేశం కోసం ధర్మం కోసం ఇలా కునుకేసి కలలు కనడం తప్పా..? అలా ఎలా అపార్థం చేసుకుంటారండి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు..దేశం కోసం, ధర్మం కోసం.. ఒక కునుకు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ కామెంట్స్‌పై బీజేపీ కార్యకర్తలు కూడా అంతేరీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Pawan Kalyan : వైసీపీకి ఊహించని షాక్.. జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా జరిగిందేంటి..!?


******************************

KCR Health Condition : సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల కీలక ప్రకటన.. సమస్యేంటో చెప్పిన డాక్టర్లు..

******************************

Big Breaking : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. అసలేం జరిగిందంటే..!


******************************

Breaking : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

******************************
MLC Kavitha ED Enquiry : ఈడీ ఆఫీసు నుంచి కవిత ఎలా వచ్చారో చూడండి.. ఆమెను చూసి అంతా ఒక్కసారిగా.. ఫొటోలు వైరల్..!


******************************

Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!


******************************

Updated Date - 2023-03-12T21:48:20+05:30 IST