Share News

TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!

ABN , First Publish Date - 2023-11-02T18:57:30+05:30 IST

అవును.. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది..

TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!

అవును.. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. కోమటిరెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది. ఇక వివేక్‌, అతని కుమారుడు వంశీకి కూడా అధిష్టానం టికెట్టుపై కీలక హామీనే ఇచ్చినట్లు తెలియవచ్చింది. వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ, వంశీకి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు షాక్‌ల నుంచి కోలుకోక మునుపే కమలం పార్టీకి బిగ్ షాట్ ఒకరు రాజీనామా చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడీ వ్యవహారమే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.


Konda.jpg

ఇంతకీ ఎవరతను..?

ఆ బిగ్ షాట్ మరెవరో కాదండోయ్.. మాజీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు ఉన్న మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడిగా కొండా సుపరిచితమే. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్‌ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి.. కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య. పలు కంపెనీలకు అధిపతిగా ఉన్న కొండా.. ప్రజాసేవ చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013లో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. ఆ తర్వాత 2018 సార్వత్రిక ఎన్నికల ముందు ‘కారు’ దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే గత ఏడాది మార్చిలో ‘చేయి’ పార్టీ కాదనుకొని గతేడాది జూన్‌ చివరిలో కాషాయం కండువా కప్పుకున్నారు.

Konda-1.jpg

ఎందుకు ఇలా..?

సరిగ్గా నాలుగైదు నెలల కిందట ఉన్న బీజేపీకి.. ఇప్పుడున్న పార్టీకి చాలా వరకూ తేడా ఉందనేది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఎక్కడో ఉన్న పార్టీని బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చింది బండి సంజయ్ మాత్రమేనని కమలనాథులు చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు జీహెచ్ఎంసీ, ఉప ఎన్నికలే నిదర్శనం. అయితే.. ఎప్పుడైతే బండిని తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలను అధిష్టానం కట్టబెట్టిందో నాటి నుంచే మునుపెన్నడూ లేని విధంగా బీజేపీలో గ్రూపులు, వర్గాలు ఏర్పడిన పరిస్థితి. వరుసగా రహస్య సమావేశాలు.. ఆ మధ్యనే పలువురు కాషాయం కండువాలు తీసేసి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. ఇది కాస్త ఎన్నికల షెడ్యూల్ ముందువరకూ కొనసాగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకుగాను అభ్యర్థులను ప్రకటించడం, ఆశావహులకు టికెట్లు రాకపోవడం, సీనియర్లంతా పోటీకి దూరంగా ఉండటం ఇవన్నీ చూసిన కొందరు కీలక నేతల, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా కాషాయం కండువాను పక్కనెట్టడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తుతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించడం.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులుగా ఉంటారని టాక్ నడిచింది. దీంతో తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోకి వచ్చి ఇలా చేయడమేంటి..? అని పార్టీ పెద్దలపై గుర్రుమన్నారట. ఇది కాస్త చివరికి పార్టీ మారే పరిస్థితికి వచ్చిందని టాక్ నడుస్తోంది.

Konda-And-Revanth.jpg

మొత్తానికి చూస్తే.. కొండా కాషాయ పార్టీకి రాజీనామా చేయడం పక్కా అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరూ కాంగ్రెస్‌కు క్యూ కడుతుండటంతో మళ్లీ ‘చేయి’ కిందికి వెళ్తారా లేకుంటే తన సొంతూడు అయిన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారా..? అనేదానిపై క్లారిటీ రాలేదు. ఇప్పటికే కాంగ్రెస్‌లో కీలక నేతలంతా వచ్చి చేరుతుండటంతో అధికారంలోకి వచ్చేశామన్నంతలా ఆ పార్టీ శ్రేణులు ఫీలవుతున్నాయి. ఇప్పుడు కొండా కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటే కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Konda-Visveshwar-Reddy.jpg


ఇవి కూడా చదవండి


CBN : ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు.. ఎన్నిరోజులు ఉంటారంటే..?


Big Breaking : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ.. ముగ్గురు కీలకనేతలపై కూడా..!!


Updated Date - 2023-11-02T18:59:34+05:30 IST