Home » Konda Vishweshwar Reddy
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్హాట్గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని.. దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని కొండా విశ్వేశ్వర్రెడ్డి వెల్లడించారు.
కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్ తప్పిదం.. ప్రాజెక్టు డిజైన్లోనే లోపాలు ఉన్నాయి.. ఏ కోణంలో చూసినా వైఫల్యాలే ఉన్నాయి.. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారు.
నగరంలోని గుల్జార్హౌజ్లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్ భాయ్కే పార్టీ(ఎంఐఎం), బాప్ బేటేకే పార్టీ (బీఆర్ఎస్), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు.