Indian National: షార్జాలో దారుణ ఘటన.. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భారతీయుడు.. ఆపై..
ABN , First Publish Date - 2023-03-31T10:08:31+05:30 IST
షార్జాలో(Sharjah) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ జాతీయుడు (Indian National) భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆపై 11వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు.
అబుదాబి: షార్జాలో(Sharjah) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ జాతీయుడు (Indian National) భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆపై 11వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పారామెడిక్స్ టీం, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని కోన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అతని వయసు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
కాగా, మృతుడు దూకిన భవనంపై అంతస్తు వద్ద పోలీసులు సూసైడ్ నోట్ను (Suicide Note) స్వాధీనం చేసుకున్నారు. అందులో 11వ అంతస్తులోని తమ ఫ్లాట్లో ఉన్న మూడు మృతదేహాలను తరలించాల్సిందిగా రాసి ఉంది. దాంతో మొదట అతనొక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన పోలీసులు ఈ పరిణామంతో షాక్ అయ్యారు. వెంటనే అతని ఫ్లాట్కి వెళ్లి చూశారు. అక్కడ మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పడి ఉన్నాయి. దాంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించారు. గత ఆరు నెలలుగా మృతుడి కుటుంబం ఆ భవనంలో నివసిస్తున్నట్లు అక్కడివారు తెలిపారు. అయితే, ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని షార్జా పోలీసులు(Sharjah Police) చెప్పారు.
ఇది కూడా చదవండి: ఫోన్ స్క్రీన్ లాక్తో వచ్చిన తంటా.. సరియైన గుర్తింపు లేని కారణంగా 7 నెలలుగా ఎడారిలో తెలుగు ప్రవాసీ మృతదేహాం