Jammu and Kashmir : జమ్మూ-కశ్మీరుపై దాడికి రెచ్చగొడుతున్న హిజ్బుల్ ముజాహిదీన్

ABN , First Publish Date - 2023-03-23T17:30:16+05:30 IST

భారత దేశంలో అంతర్భాగమైన జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)పై దాడికి పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీరులోని ప్రతి కుటుంబం మద్దతివ్వాలని

Jammu and Kashmir : జమ్మూ-కశ్మీరుపై దాడికి రెచ్చగొడుతున్న హిజ్బుల్ ముజాహిదీన్
Hizbul Mujahideen

న్యూఢిల్లీ : భారత దేశంలో అంతర్భాగమైన జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)పై దాడికి పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీరులోని ప్రతి కుటుంబం మద్దతివ్వాలని హిజ్బుల్ ముజాహిదీన్ (Hizbul Mujahideen) ఉగ్రవాద సంస్థ రెచ్చగొడుతోంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు వచ్చి, ఆయుధం పట్టి, నియంత్రణ రేఖ (LoC)ని దాటాలని పిలుపునిచ్చింది. ఈ వివరాలను భారత దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.

హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ మన దేశానికి ముప్పుగా పరిణమించిన ప్రధాన ఉగ్రవాద సంస్థలు. ఇవి తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువ మందిని నియమించుకుంటూ, ఎక్కువ నిధులను సేకరిస్తున్నాయి. జమ్మూ-కశ్మీరును విముక్తి చేయడం కోసం ఇటీవల కోట్లాలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సమావేశం జరిగింది. ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది.

నియంత్రణ రేఖ వెంబడి కార్యకలాపాలను పెంచాలని స్థానిక కమాండర్లకు హిజ్బుల్ ముజాహిదీన్ ఆదేశాలిచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులకు దగ్గరగా వెళ్ళవద్దని కూడా హెచ్చరించింది. వేసవి కాలం వస్తుండటంతో చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించారు. అతను పాకిస్థాన్‌లో కానీ, పాక్ ఆక్రమిత కశ్మీరులో కానీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి కూడా పని చేస్తోంది. సయ్యద్ సలావుద్దీన్ భారత ప్రభుత్వానికి వాంటెడ్ క్రిమినల్.

ఇవి కూడా చదవండి :

Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్

Rahul Gandhi Vs Rajnath Singh : రాహుల్ గాంధీకి శిక్షపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

Updated Date - 2023-03-23T17:30:16+05:30 IST