Share News

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

ABN , First Publish Date - 2023-12-05T12:00:39+05:30 IST

థాయ్‌లాండ్‌లో ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి.

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమదానికి బస్సు అతి వేగమే కారణమని అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదం జరిగిన విషయాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ముందు భాగం సగానికి చీలిపోయింది. శిథిలాల్లో చిక్కుకున్న ప్రయాణికులు చనిపోగా.. గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది బయటికి తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-12-05T12:00:41+05:30 IST