రోజూ సందడిగా ఉండే ఇంట్లో అంతా సైలెంట్.. రాత్రి 9 గంటల సమయంలో అనుమానంతో పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2023-02-14T15:57:11+05:30 IST

సంసారం ఓ చదరంగం లాంటిది. కష్టసుఖాలు, లోటుపాట్లు, సర్దుకుపోవడాలు, చేదు-తీపి ఇవన్నీ కలగలిపిందే కుటుంబం. ఒకరికొకరు కలిసి సాగించే నూరేళ్ల ప్రయాణంలో

రోజూ సందడిగా ఉండే ఇంట్లో అంతా సైలెంట్.. రాత్రి 9 గంటల సమయంలో అనుమానంతో పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..
పక్కింటి వాళ్లు వెళ్లి చూస్తే..

సంసారం ఓ చదరంగం లాంటిది. కష్టసుఖాలు, లోటుపాట్లు, సర్దుకుపోవడాలు, చేదు-తీపి ఇవన్నీ కలగలిపిందే కుటుంబం. ఒకరికొకరు కలిసి సాగించే నూరేళ్ల ప్రయాణంలో దాంపత్యంలో చిన్న చిన్న ఇబ్బందులు సహజమే. ఆలుమగలుగా ఎవరి బాధ్యతలు వారికుంటాయి. పైగా ఎన్నో అవసరాలు.. ఎన్నో ఖర్చులు ఉంటాయి. అందులోని కష్టాన్ని ఇద్దరూ అర్థం చేసుకోగలితే అది ఎంతటి భారమైనా ఈజీగా సమసిపోతుంది. అంతేకానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోతుంది.

చక్కనైన కుటుంబం (parents). ఓ చిన్న బిడ్డతో సంసారం సాఫీగా సాగిపోతుంది. అలాంటి కుటుంబంలోకి అనుకోని ఆపద తటస్థించింది. అందులోంచి బయటపడలేనేమో అన్నుకున్నాడో.. ఏమో తెలియదు గానీ ఆ యువకుడు తీవ్ర నిర్ణయమే తీసుకున్నాడు. అతని తొందరపాటు.. అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

ఇది కూడా చదవండి: Newly Married Couple: ఈ కొత్త జంటకు దేవుడెంత అన్యాయం చేశాడంటే..

ఒడిశా (Odisha) కొరాపుట్ జిల్లా (Koraput dist)లోని తొయపుట్ గ్రామాని (Toyaput area)కి చెందిన బిశోయ్ (27) అనే యువకుడు.. భార్య జ్యోత్స్న(24), రెండేళ్ల కుమార్తె (wife and daughter)తో కలిసి జీవిస్తున్నాడు. బిశోయ్ (Bisoi) స్థానికంగా ఓ మొబైల్ షాపు (Mobile shop)నిర్వహిస్తున్నాడు. అయితే కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. అప్పులు తీరకపోగా.. మరింత పెరిగిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. దాంట్లో నుంచి బయటపడే మార్గం తెలియక సతమతం అయిపోయాడు. చివరికి అతడు తీసుకున్న నిర్ణయం హృదయాన్ని కలిచివేసింది.

ఆదివారం సాయంత్రం మొబైల్ షాపు క్లోజ్ చేసి ఇంటికి వచ్చీరాగానే భార్య (killing wife) మెడకు ఛార్జర్ వైరు బిగించి ప్రాణం తీశాడు. అనంతరం ముక్కుపచ్చలారని రెండేళ్ల కుమార్తె (Girl child)ను కూడా అదే మాదిరిగా హతమార్చి.. అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ముగ్గురూ ఒకేసారి శవాలుగా మారిపోయారు. ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి రాత్రి 9 గంటలకు తలుపు తట్టగా ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపులు విరగొట్టి చూడగా ఒకే గదిలో శవాలుగా పడి ఉన్నారు. ఒకేసారి ముగ్గురు జీవచ్ఛవాలు(bodies)గా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు గొడవల కారణంగానే భార్య, బిడ్డను భర్త హత్య చేసి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?

Updated Date - 2023-02-14T15:57:12+05:30 IST