Newly Married Couple: ఈ కొత్త జంటకు దేవుడెంత అన్యాయం చేశాడంటే..

ABN , First Publish Date - 2023-02-14T11:46:26+05:30 IST

సింహాచలం (Simhachalam)లో సంబరంగా పెళ్లి (Wedding) చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్‌ (Reception) జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు..

Newly Married Couple: ఈ కొత్త జంటకు దేవుడెంత అన్యాయం చేశాడంటే..
ఈ కొత్త జంటకు..

ఇచ్ఛాపురం: సింహాచలం (Simhachalam)లో సంబరంగా పెళ్లి (Wedding) చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్‌ (Reception) జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత వధువు ఇంటికి వెళ్లారు. కాసేపు ఉండి బైక్‌ (Bike) పై బయల్దేరారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాదంలో వధూవరులిద్దరూ (Bride and groom) మృతి చెందారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురం (Ichhapuram) మున్సిపాల్టీ 23వ వార్డు బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణు అలియాస్‌ సింహాచలం (26)కు ఒడిసా (Odisha) రాష్ట్రం బరంపురానికి చెందిన సుభద్ర అలియాస్‌ ప్రవల్లిక (23)తో ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది (Marriage). పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం మధ్యాహ్నం వరుడు ఇంటివద్ద రిసెప్షన్‌ (విందు) జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం సోమవారం సాయంత్రం బరంపురానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. బలేగడ జాతీయ రహదారి పెట్రోల్‌ బంక్‌ (Petrol Bunk) సమీపంలో వీరి బైక్ ప్రమాదానికి గురైంది. వీరి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో వధువు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలతో పడి ఉన్న వరుడిని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వేణు వస్త్ర దుకాణం (Clothing store)లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

ఇది కూడా చదవండి: ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?

Updated Date - 2023-02-14T11:50:20+05:30 IST